YS Sunitha: అవినాష్ రెడ్డి నేర చరిత్రపై ఈసీకి నివేదిక ఎందుకు ఇవ్వలేదు?: వివేకా కుమార్తె సునీత

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేరచరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని.. వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు.

Published : 21 Apr 2024 18:45 IST

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేరచరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని.. వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటినా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, హత్యా నేరంలో పాలుపంచుకున్నవారు ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని సునీత తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని