YSRCP: సభ నుంచి వెళ్లిపోకుండా.. జనానికి ఎరగా వైకాపా భోజనాలు!
వైకాపా ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లిపోకుండా నిలువరించేందుకు.. విశాఖ నేతలు వారికి భోజనాలను ఎరగా వేస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి నేతలు సన్మానం చేస్తున్న క్రమంలో.. అప్పటికే విసుగెత్తిపోయిన ప్రజలు ఇంటిబాట పట్టారు. దానిని గమనించిన ఓ వ్యక్తి ‘‘అమ్మా భోజనాలు ఉన్నాయి ఎవరూ వెళ్లొద్దు’’.. అంటూ మైక్లో చెప్పారు.
Updated : 02 Apr 2024 15:38 IST
Tags :