AP News: పేదల గృహ నిర్మాణాల మాటున వైకాపా నేతల దోపిడీ దందా

నిరుపేదల కోసం ప్రత్యేకంగా కాలనీలు నిర్మిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన జగన్‌.. వారిని అప్పులపాలు చేసి వైకాపా నేతలను మాత్రం కోటీశ్వరులను చేశారు. జగన్‌ అమలు చేసే ప్రతి స్కీంలోనూ.. ఓ స్కాం ఉంటుందన్న విపక్షాల ఆరోపణల్ని నిజం చేశారన్నదే ఈ పథకంపై ఉన్న ప్రధాన విమర్శ.

Published : 24 Apr 2024 22:33 IST

నిరుపేదల కోసం ఇళ్లు కాదు.. ప్రత్యేకంగా కాలనీలే నిర్మిస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన జగన్‌.. వారిని అప్పులపాలు చేసి వైకాపా నేతలను మాత్రం కోటీశ్వరులను చేశారు. జగన్‌ అమలు చేసే ప్రతి స్కీంలోనూ.. ఓ స్కాం ఉంటుందన్న విపక్షాల ఆరోపణల్ని నిజం చేశారన్నదే ఈ పథకంపై ఉన్న ప్రధాన విమర్శ. జగనన్న కాలనీలకు భూ సేకరణ పేరుతో వైకాపా నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారు. నివాస యోగ్యం కాని ప్రాంతాలను ఎంపిక చేసి ఇళ్ల స్థలాలు కేటాయించి.. వసతులు లేని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ప్రధానంగా రాయలసీమలోని 4 జిల్లాల్లో ఎక్కడా జగనన్న కాలనీల నిర్మాణాలే సాగలేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలు, పేదల గృహ నిర్మాణాల మాటున వైకాపా నేతల దోపిడీ దందా కొనసాగింది. 

Tags :

మరిన్ని