Rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం

Eenadu icon
By Video News Team Published : 04 Nov 2025 12:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో గంట పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. మామిండ్లవాడ, గ్యాస్‌ గోదాం ఏరియా, బుడిగ జంగాల కాలనీ, గాంధీనగర్, ఇందిరానగర్ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాల్లో జోరు వాన కురిసింది. హుస్నాబాద్ మార్కెట్‌ యార్డ్‌లోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం పడింది. ఎనుమాముల మార్కెట్‌లో పత్తి, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త చదివారా: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్‌ ఇచ్చిన స్పీకర్‌

Tags :

మరిన్ని