By Video News TeamPublished : 03 Jul 2024 13:26 IST
Ee
Font size
A
A+
A++
మార్కెట్లో నకిలీ సిమ్లు ఎన్ని కావాలన్నా దొరకడం ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుల అవగాహన లేమి, టెలికాం ఆపరేటర్ల పర్యవేక్షణ లోపం మోసగాళ్లకు కలసివస్తోంది. వేలిముద్రలను క్లోన్ చేసి, నకిలీ ధ్రువీకరణ పత్రాలు జతచేసి వేరొకరి పేరుతో చిటికెలో నకిలీ సిమ్లు తీసుకుంటున్నారు. సిమ్ విక్రేతలు డబ్బులకు కక్కుర్తిపడి నకిలీ సిమ్లు తీసుకుంటూ వాటిని అసాంఘిక శక్తులకు అమ్ముతున్నారు. అంతిమంగా ఇవి దేశం దాటిపోతున్నాయి. ఈ నెంబర్లతో మోసగాళ్లు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా అమాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.