CPI Narayana: వైకాపా పాలనలో భూ, మద్యం మాఫియాకు అడ్డాగా విశాఖ: నారాయణ
[11:48]
విశాఖపట్నం రాజధాని అనే మాట అభాసుపాలైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) విమర్శించారు. వైకాపా (YSRCP) పాలనలో మద్యం మాఫియా, భూదందాలకు విశాఖ (Visakhapatnam) అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో విశాఖలో బెట్టింగ్, గంజాయి దందాలు పరాకాష్ఠకు చేరాయని, ఈ ముఠాలను కాపాడటం కోసం విజయవాడ కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక అనామకుడి దగ్గర రూ.350 కోట్లు దొరికాయంటే.. పరిస్థితి ఏటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ ద్వారా విచారణ చేయాలని ఆయన కోరారు.