‘‘రైతన్నలు ఆకలితో చావొద్దు.. ఆత్మహత్యలు చేసుకుని చావాలి’’.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు
[16:58]
‘‘దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావొద్దు.. ఆత్మహత్యలు చేసుకుని చావాలి’’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈనెల 21న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం, మురికి కాల్వ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం భారాస కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆలస్యంగా బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు సామజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.