Payyavula Keshav: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై తెదేపా పవర్ పాయింట్ ప్రజంటేషన్
[14:02]
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై బురద చల్లడం ద్వారా తెదేపా అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కష్టం మాత్రమే కలిగించిందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కానీ, రాష్ట్రంలోని లక్షలాదిమంది యువతకు తీరని నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును చేపట్టారని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పయ్యావుల కేశవ్ వివరించారు. కేవలం అవినీతి బురద చల్లేందుకే వైకాపా ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.