iPhone prices slashed: ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ధరలు తగ్గించిన యాపిల్‌

Eenadu icon
By Business News Team Updated : 26 Jul 2024 19:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

iPhones cheaper | ఇంటర్నెట్ డెస్క్‌: ఐఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. యాపిల్ (apple) కంపెనీ తన ఐఫోన్‌ (iPhone prices slashed) ధరలను తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు యాపిల్‌ బదిలీ చేసింది. దీంతో ఐఫోన్‌ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. యాపిల్ తాజా నిర్ణయంతో ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్‌ 13, 14, 15 మోడళ్ల ధరలూ స్వల్పంగా తగ్గాయి.ఐఫోన్‌ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్‌ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది.

గూగుల్‌కు పోటీగా కొత్త సెర్చింజిన్‌.. తీసుకొచ్చిన చాట్‌జీపీటీ ఓనర్‌

సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్లు లాంచ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తూ ఉంటుంది. కానీ, యాపిల్‌ తొలిసారి ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్ల ధరలను తగ్గించడం గమనార్హం. బడ్జెట్‌లో మొబైల్‌ ఫోన్లపై ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం. సాధారణంగా దేశీయంగా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లకు 20 శాతం కస్టమ్స్‌ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జి (22 శాతం) వర్తిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. తాజాగా కస్టమ్స్‌ సుంకం తగ్గించాక బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ 15 శాతం, 1.5 శాతం సర్‌ఛార్జి కలిపి 16.5 శాతానికి చేరింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ ప్రస్తుతం 13, 14, 15 బేసిక్‌ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా..  ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లను దిగుమతి చేస్తోంది. కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడంతో ఆ మేర ధరలు తగ్గాయి. దేశీయంగా తయారైన ఫోన్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో తగ్గింపు స్వల్పంగానే ఉంది.

Tags :
Published : 26 Jul 2024 17:55 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని