బ్రేకింగ్

breaking
29 May 2022 | 16:05 IST

పానీపూరి తిని 97 మందికి అస్వస్థత

మాండ్లా:  పానీపూరి తిని 97 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగార్‌పూర్‌ ఏరియాలో వీరందరూ ఒకేచోట పానీపూరి తిన్నట్లు పోలీసులు గుర్తించారు. అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పానీపూరి అమ్మిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్‌ శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్స్‌కు పంపించామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని