బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 17:31 IST

ప్రజలకు ఏం మేలు చేశారని జగన్‌కు ఓటేయాలి: షర్మిల

టెక్కలి: జగన్ పాలనలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ వైఎస్‌ఆర్‌ ఆశయాలు నిలబెడతారని ప్రజలు జగన్‌కు ఓటేశారు. వైఎస్‌ఆర్‌ పాలనకు, జగన్‌ పాలనకు పోలిక ఉందా? రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరిందా? ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ప్రజలకు ఏం మేలు చేశారని జగన్‌కు ఓటేయాలి?’’ అని షర్మిల నిలదీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని