బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 18:50 IST

చెలరేగిన కోహ్లీ, జాక్స్‌.. బెంగళూరు ఘన విజయం

బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్‌ (100*; 41 బంతుల్లో 5×4, 10×6), కోహ్లీ (70*, 44 బంతుల్లో 6×4, 3×6) చెలరేగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. వీరి బాదుడుకు 201 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. డుప్లెసిస్‌ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో రవిశ్రీనివాసన్‌ ఒక వికెట్‌ రాబట్టుకున్నాడు.

మరిన్ని

తాజా వార్తలు