బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 21:25 IST

గైక్వాడ్ సెంచరీ మిస్‌.. హైదరాబాద్ టార్గెట్‌ 213

చెన్నై: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్‌ గైక్వాడ్‌ (98; 54 బంతుల్లో 10×4, 3×6) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. మిచెల్‌ (52; 32 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దుబే (39*; 20 బంతుల్లో 1×4, 4×6) మెరుపులు పెరిపించాడు. చివర్లో వచ్చిన ధోనీ (5*) బౌండరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లలో భువనేశ్వర్‌, ఉనద్కత్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు