చిత్రం చెప్పే విశేషాలు (06-06-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 06 Jun 2024 09:39 IST
1/22
విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో వాటర్‌ యాపిల్‌ నోరూరిస్తోంది. వేసవిలో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విలువైన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో వాటర్‌ యాపిల్‌ నోరూరిస్తోంది. వేసవిలో ఈ పండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే విలువైన ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు.
2/22
నిజామాబాద్‌ జిల్లాలో ఏ సీజన్‌ అయినా ముందుగా బోధన్‌ డివిజన్‌లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారుమళ్లను సిద్ధం చేసుకున్న కర్షకులు ప్రస్తుతం నాట్లు వేడయం ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏ సీజన్‌ అయినా ముందుగా బోధన్‌ డివిజన్‌లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారుమళ్లను సిద్ధం చేసుకున్న కర్షకులు ప్రస్తుతం నాట్లు వేడయం ప్రారంభించారు.
3/22
ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరానికి చెందిన షేక్‌ ఖాసిం... తెలుగుదేశం వీరాభిమాని. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ సాధించి.. చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి దిల్లీకి వెళ్తున్నారని తెలిసి.. గన్నవరం విమానాశ్రయానికి ఇలా సైకిల్‌పై వచ్చారు.  
ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరానికి చెందిన షేక్‌ ఖాసిం... తెలుగుదేశం వీరాభిమాని. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి మెజారిటీ సాధించి.. చంద్రబాబు ఎన్డీయే సమావేశానికి దిల్లీకి వెళ్తున్నారని తెలిసి.. గన్నవరం విమానాశ్రయానికి ఇలా సైకిల్‌పై వచ్చారు.  
4/22
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటకు చెందిన సైకత శిల్పి ఆర్‌.శంకర్‌ ఇసుకతో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటకు చెందిన సైకత శిల్పి ఆర్‌.శంకర్‌ ఇసుకతో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించారు.
5/22
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామ శివారులో ఓ రైతు యాసంగి వరి పంటను యంత్రంతో కోశాడు. ఆ సమయంలో కొన్ని గింజలు పొలంలో పడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి అవి మొలకెత్తి పచ్చని పైరులా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.
కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామ శివారులో ఓ రైతు యాసంగి వరి పంటను యంత్రంతో కోశాడు. ఆ సమయంలో కొన్ని గింజలు పొలంలో పడిపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి అవి మొలకెత్తి పచ్చని పైరులా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.
6/22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ సీసాల వినియోగం తగ్గించాలంటూ  ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ‘టర్నింగ్‌ ఆఫ్‌ ది ట్యాప్‌’ పేరిట 12 అడుగుల ఎత్తున వ్యర్థాలు, పాత ప్లాస్టిక్‌ సీసాలతో కళాకృతిని ఆవిష్కరించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌ సీసాల వినియోగం తగ్గించాలంటూ  ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ‘టర్నింగ్‌ ఆఫ్‌ ది ట్యాప్‌’ పేరిట 12 అడుగుల ఎత్తున వ్యర్థాలు, పాత ప్లాస్టిక్‌ సీసాలతో కళాకృతిని ఆవిష్కరించారు.
7/22
వర్షాల కారణంగా అమీర్‌పేట వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు నరక యాతన పడ్డారు. మరోవైపు ఓ వాహనదారుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ, డైలాగులను ఆలకిస్తూ ఇలా కనిపించాడు
వర్షాల కారణంగా అమీర్‌పేట వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు నరక యాతన పడ్డారు. మరోవైపు ఓ వాహనదారుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ, డైలాగులను ఆలకిస్తూ ఇలా కనిపించాడు
8/22
పాదచారుల సౌకర్యార్థం ఉప్పల్‌ చౌరస్తాలో రూ.35 కోట్లతో స్కైవాక్‌ నిర్మించారు. ప్రమాదాలు జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిపైనుంచి రోడ్డు సులువుగా దాటొచ్చు. అయినా కొందరు నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా రోడ్ల పైనుంచే ఇలా వెళ్తున్నారు.
పాదచారుల సౌకర్యార్థం ఉప్పల్‌ చౌరస్తాలో రూ.35 కోట్లతో స్కైవాక్‌ నిర్మించారు. ప్రమాదాలు జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిపైనుంచి రోడ్డు సులువుగా దాటొచ్చు. అయినా కొందరు నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా రోడ్ల పైనుంచే ఇలా వెళ్తున్నారు.
9/22
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి రంగధాముని చెరువు, ఐడీఎల్‌ యాక్సిస్‌ రోడ్డు కూడలి వద్ద వృక్షాలను, పర్యావరణాన్ని రక్షించాలని స్ఫూర్తి కలిగించేలా ఏర్పాటు చేసిన ఈ కట్టడం ఆకట్టుకుంది. 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి రంగధాముని చెరువు, ఐడీఎల్‌ యాక్సిస్‌ రోడ్డు కూడలి వద్ద వృక్షాలను, పర్యావరణాన్ని రక్షించాలని స్ఫూర్తి కలిగించేలా ఏర్పాటు చేసిన ఈ కట్టడం ఆకట్టుకుంది. 
10/22
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. స్థానికంగా ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో హర్షవర్ధన్‌రాణే, వర్షిని, రియా సచ్‌దేవ ఉత్సాహంగా పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. స్థానికంగా ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో హర్షవర్ధన్‌రాణే, వర్షిని, రియా సచ్‌దేవ ఉత్సాహంగా పాల్గొన్నారు.
11/22
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు  ఒక్క వారంలో వినియోగించినవి. నీటి, శీతల పానీయాల బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ పైపులు  చిన్నపాటి గుట్టలా తయారయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లి గ్రామానికి  సమీపంలో కనిపించాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు  ఒక్క వారంలో వినియోగించినవి. నీటి, శీతల పానీయాల బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ పైపులు  చిన్నపాటి గుట్టలా తయారయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లి గ్రామానికి  సమీపంలో కనిపించాయి.
12/22
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో కాలువలో పడిన నీరంతా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి చేరింది. మోకాళ్లు మునిగే వరకు వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో కాలువలో పడిన నీరంతా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి చేరింది. మోకాళ్లు మునిగే వరకు వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
13/22
నెల్లూరు: భగభగమనే ఎండతో బుధవారం మధ్యాహ్నం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడగా- సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం ఇలా మేఘావృతమైంది. నాలుగు చినుకులు పడతాయనుకునేలోపే దోబూచులాడుతూ.. ఉట్టిగనే అలా తరలివెళ్లాయి.
నెల్లూరు: భగభగమనే ఎండతో బుధవారం మధ్యాహ్నం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడగా- సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం ఇలా మేఘావృతమైంది. నాలుగు చినుకులు పడతాయనుకునేలోపే దోబూచులాడుతూ.. ఉట్టిగనే అలా తరలివెళ్లాయి.
14/22
మహబూబ్‌నగర్‌ బాలకేంద్రంలో వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి పట్టణంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు.. మధురమైన స్వరంతో చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక సంకీర్తనలు అలరించాయి.
మహబూబ్‌నగర్‌ బాలకేంద్రంలో వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి పట్టణంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు.. మధురమైన స్వరంతో చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక సంకీర్తనలు అలరించాయి.
15/22
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో బుధవారం సాయంత్రం ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. చిన్నారులు ఇక్కడ నేర్చుకున్న కళలను ప్రదర్శించారు. శివ తాండవం నృత్య రూపకం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో బుధవారం సాయంత్రం ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. చిన్నారులు ఇక్కడ నేర్చుకున్న కళలను ప్రదర్శించారు. శివ తాండవం నృత్య రూపకం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
16/22
సహజసిద్ధమైన వస్తువుల వినియోగాన్ని నిత్యావసరాల్లో పెంచాలని కోరుతూ ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనేకచోట్ల మొక్కలు నాటారు.
సహజసిద్ధమైన వస్తువుల వినియోగాన్ని నిత్యావసరాల్లో పెంచాలని కోరుతూ ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనేకచోట్ల మొక్కలు నాటారు.
17/22
నిజామాబాద్‌: రెంజల్‌ మండలంలోని కందకుర్తి గోదావరి నది ఇసుక దిబ్బల్లో పలువురు రైతులు తర్బూజ, కీరదోస సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎరువుల వినియోగం లేకుండా పండించిన తర్బూజకు మార్కెట్లో డిమాండ్‌ ఉందని చెబుతున్నారు.
నిజామాబాద్‌: రెంజల్‌ మండలంలోని కందకుర్తి గోదావరి నది ఇసుక దిబ్బల్లో పలువురు రైతులు తర్బూజ, కీరదోస సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎరువుల వినియోగం లేకుండా పండించిన తర్బూజకు మార్కెట్లో డిమాండ్‌ ఉందని చెబుతున్నారు.
18/22
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన సీఎం రమేశ్‌ బుధవారం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రమేశ్‌ దంపతులకు తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌ దంపతులు, ఆలయ ఈఓ బండారు ప్రసాద్‌ స్వాగతం పలికారు.
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన సీఎం రమేశ్‌ బుధవారం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రమేశ్‌ దంపతులకు తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్‌ దంపతులు, ఆలయ ఈఓ బండారు ప్రసాద్‌ స్వాగతం పలికారు.
19/22
మెదక్‌: వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో కృత్తికా నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామికి లక్ష పుష్పార్చన చేశారు. విజయదుర్గా సమేత సంతాన క్షేత్రంలో మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
మెదక్‌: వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో కృత్తికా నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామికి లక్ష పుష్పార్చన చేశారు. విజయదుర్గా సమేత సంతాన క్షేత్రంలో మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
20/22
చిత్తూరు: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వేణుగోపాలుని రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. తితిదే అనుబంధ శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.
చిత్తూరు: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వేణుగోపాలుని రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. తితిదే అనుబంధ శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు.
21/22
మెదక్‌: సంగారెడ్డి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాల అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మెదక్‌: సంగారెడ్డి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాల అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
22/22
హైదరాబాద్‌: అక్కడక్కడా..మళ్లీ రూపాయి ఫోన్‌ బాక్సులు కనిపిస్తున్నాయి. చరవాణి ఛార్జింగ్‌ లేనప్పుడు అత్యవసరంగా ఎవరైనా ఇంటికి సమాచారం ఇచ్చుకోవడానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ చిత్రం నాంపల్లి-గాంధీభవన్‌ సమీపంలో కనిపించింది.
హైదరాబాద్‌: అక్కడక్కడా..మళ్లీ రూపాయి ఫోన్‌ బాక్సులు కనిపిస్తున్నాయి. చరవాణి ఛార్జింగ్‌ లేనప్పుడు అత్యవసరంగా ఎవరైనా ఇంటికి సమాచారం ఇచ్చుకోవడానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ చిత్రం నాంపల్లి-గాంధీభవన్‌ సమీపంలో కనిపించింది.
Tags :

మరిన్ని