AP Inter: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు ప్రకటించింది.
AP Inter Exam Fee | అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 30తోనే ముగిసింది. అయితే, ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మరో ఐదు రోజుల పాటు బోర్డు ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్ 5వరకు; రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు గడువు పెంపుపై పాఠశాల ప్రిన్సిపాళ్లు, కళాశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలని కోరారు. ఇంటర్ మొదటి/రెండో సంవత్సరం పరీక్ష ఫీజు రూ.550 కాగా.. రెండో ఏడాది ప్రాక్టికల్స్కు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ