APPSC: ‘పాలిటెక్నిక్‌’లో లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. వేతనం ఎంతంటే?

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలివే..

Published : 22 Dec 2023 18:19 IST

అమరావతి: ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ (ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌) కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీటెక్‌/డిగ్రీ/పీజీ అర్హతతో మొత్తం 99 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18న రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని APPSC స్పష్టం చేసింది. ఆయా విభాగాల్లో అధ్యాపక పోస్టులను బట్టి అభ్యర్థులు బీటెక్‌/ఎంటెక్‌/తదితర కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయో పరిమితి 18 నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు కల్పించారు. 
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు వేతనం రూ.56,100 నుంచి రూ.98, 400 మధ్య చెల్లించనున్నారు. 
  • దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.370 (అప్లికేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు కలిపి); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.250 చొప్పున(ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు) చెల్లించాల్సి ఉంటుంది. 
  •  రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. పూర్తి వివరాలు ఈ కింది పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని