APPSC: త్వరలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
అమరావతి: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మొత్తం 1,199 ఉద్యోగాల భర్తీని చేపడతామని చెప్పారు. సెప్టెంబరులోపు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. గ్రూప్-1 కింద 100, గ్రూప్-2 కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే గ్రూప్స్ పరీక్షల సిలబస్లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందన్నారు. అయితే, ఉద్యోగ నియామకాలపై వదంతులు నమ్మొద్దని గౌతమ్ సవాంగ్ అభ్యర్థులకు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!