ప్రజలే పాలకులు.. పాలితులు!
ప్రస్తుత ప్రపంచంలో అత్యధికులు ఆమోదించి, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం. ఈ భావనే ఆధునిక, నైతిక, ఆదర్శవంతమైన, మహోన్నత జీవనశైలిగా మారింది. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇక్కడ పాలకులు, పాలితులు ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది.
![](https://assets.eenadu.net/article_img/prb211123-1aa.jpg)
ప్రజాస్వామ్యం - అర్థవివరణ
ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో 'Democracy' అంటారు. ఇది 'Demos, 'Kratos' అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. 'Demos' అంటే ప్రజలు, 'Kratos' అంటే అధికారం/పాలన అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం ఉండటం. గ్రీకు పౌరులు మొదటిసారిగా నగర రాజ్యానికి సంబంధించిన వివిధ చట్టాలపై ప్రత్యక్షంగా ఓటు వేశారు. ప్రజాస్వామ్య ఆవిర్భావం అనేది ప్రథమంగా ఏథెన్స్ (గ్రీస్) అసెంబ్లీతో ముడిపడి ఉంది.
![](https://assets.eenadu.net/article_img/prb211123-1b.jpg)
- 17వ శతాబ్దంలో ఇంగ్లండ్లో ప్రజాస్వామ్య సంస్థలు పనిచేయడం ప్రారంభించాయి. నిరపేక్ష రాచరికాలు పతనమైన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వ భావాల గురించి జాన్లాక్, రూసో, థామస్ పెయిన్ లాంటి మేధావులు తమ రచనల్లో పేర్కొన్నారు.
- 1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 1980 దశకం ద్వితీయార్ధంలో యూరప్లోని దక్షిణ, మధ్య, ప్రాచ్య దేశాల్లో ప్రాతినిధ్య అంశాలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని అనుసరించారు.
- లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, తైవాన్, దక్షిణ కొరియా, పాలస్తీనా, ఆఫ్రికా దేశం లెబనాన్ లాంటివి 1900, 2000 దశకాల్లో ఉదారవాద ప్రజాస్వామ్యం వైపు పయనించాయి.
- ‘ఫ్రీడమ్ హౌజ్’ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 1900 సంవత్సరం నాటికి వయోజన ఓటు హక్కును ఇచ్చిన దేశం ఒక్కటీ లేదు. కానీ 2000 నాటికి ప్రపంచంలోని 192 రాజ్యాల్లో 120 రాజ్యాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాయని ఆ సంస్థ విశ్లేషించింది.
![](https://assets.eenadu.net/article_img/prb211123-1d.jpg)
లక్షణాలు
స్వతంత్ర న్యాయవ్యవస్థ: ప్రజాస్వామ్యంలో మరో కీలక లక్షణం స్వతంత్ర న్యాయవ్యవస్థ. దీనిద్వారా రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను న్యాయవ్యవస్థ రద్దు చేస్తుంది. ప్రజల స్వేచ్ఛ సంరక్షణకు కాపలాదారు పాత్ర పోషిస్తుంది.
రిట్స్ జారీ: ప్రజల ప్రాథమిక స్వేచ్ఛా సంరక్షణకు న్యాయవ్యవస్థ రిట్స్ను జారీ చేస్తుంది. భారతదేశంలో సుప్రీంకోర్టు ఆర్టికల్-32 ప్రకారం, హైకోర్టులు ఆర్టికల్-226 ప్రకారం అయిదు రకాల రిట్స్ జారీ చేస్తాయి. అవి 1) హెబియస్ కార్పస్ 2) మాండమస్ 3) ప్రొహిబిషన్ 4) సెర్షియోరరి 5) కోవారెంటో
- ఆర్టికల్ 39(ఎ) ప్రకారం భారతదేశంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కుంది.
ప్రాధాన్యం
- ప్రబలమైన రాజకీయ ఉద్రిక్తతలు, సామాజిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం శాంతియుత, రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అందిస్తుంది.
- ప్రజాస్వామ్యంలో అసమ్మతివాదులు, వ్యతిరేకులు, విరుద్ధభావాలున్న వారికి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియలో సంప్రదింపులు, సఖ్యత, రాజీ, ఏకాభిప్రాయం లాంటివి కీలకంగా ఉంటాయి.
![](https://assets.eenadu.net/article_img/prb211123-1c.jpg)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు