పరిసరాలతో సహజీవనంపై ప్రత్యేక దృష్టి!
మానవుడికి, పర్యావరణానికి ఉండే పరస్పర సంబంధాలను విస్తృతంగా చర్చించే విభాగంగా మానవ భూగోళ శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇందులో అన్నిరకాల సాంఘిక శాస్త్రాలు మిళితమై ఉంటాయి. భూమిపై ఉన్న రకరకాల సమాజాలను, మానవ కార్యకలాపాలను అధ్యయనం చేసి సమాజ సమస్యలకు పరిష్కారం సూచించే విస్తృత పరిధి ఉన్న శాస్త్రంగా స్థిరపడింది.
ప్రపంచ భూగోళశాస్త్రం
సారాంశం
- ప్రపంచాన్ని ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా, భవిష్యత్తులో ఏవిధమైన మార్పులకు గురవుతుంది అనే అంశాలను మానవ భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అది ముఖ్యంగా ప్రజలు ఎక్కడ ఉన్నారు, దేనిని ఇష్టపడతారు, ప్రదేశం, కాలంతో ఏవిధంగా ప్రభావితమవుతున్నారు, ఏ రకమైన భూభాగాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు, ఆక్రమించిన సహజ భూభాగాల మీద ఎలాంటి వాటిని నిర్మిస్తున్నారు అనే అంశాలపై దృష్టిసారిస్తుంది. మానచిత్ర లేఖన శాస్త్రం మాదిరిగా భౌతిక పర్యావరణంతో ప్రత్యక్ష సంబంధం లేని అన్ని భూగోళశాస్త్ర అంశాలను, ఆసక్తులను వివరిస్తుంది.
- మానవ భూగోళ శాస్త్రం అన్ని సాంఘిక శాస్త్రాలను ఏకం చేస్తుంది. ఎందుకంటే వీటికి అవసరమైన ప్రాదేశిక, కాల వ్యవస్థల దృక్కోణాన్ని అందిస్తుంది. ఈ దృక్పథాలు సాంఘిక శాస్త్రాల్లో లేవు. అదే సమయంలో మానవ భూగోళ శాస్త్రం మానవుల ప్రవర్తన, రాజకీయ, ఆర్థిక లేదా సామాజిక భూగోళ శాస్త్రాల విశ్లేషణకు ఇతర సాంఘిక శాస్త్రాల నుంచి విషయాలను గ్రహిస్తుంది. నీ మనుషులు నివసిస్తున్న ప్రపంచంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు, దేశాలను ప్రభావితం చేసే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
- వివిధ సమాజాలు, సంస్కృతుల మధ్య ఉండే వ్యత్యాసాలను, భూమిపైన వివిధ ప్రాంతాల్లో అవి సృష్టించిన మానవ భూదృశ్యాల్లోని విభిన్నతలను వివరిస్తుంది. మానవ భూగోళ శాస్త్రం సామాజిక సమూహాలు, వాటి సహజ పర్యావరణం మధ్య ఉండే సహజీవన సంబంధాన్ని అవగాహన చేసుకోవడానికి సహాయపడటం వల్ల భూమధ్య రేఖ, ఉష్ణ ఎడారులు, టండ్రాల లాంటి విలక్షణమైన భౌగోళిక ప్రాంతాల్లోని భౌతిక వాతావరణానికి మనిషి సర్దుబాటు కావడానికి, మానవ భూగోళ శాస్త్రానికి మంచి సంబంధం ఉంది. అందరూ వ్యక్తిగతంగా, సమష్టిగా నివసిస్తున్న, నిర్వహిస్తున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మానవ భూగోళ శాస్త్ర ప్రాదేశిక ప్రతిస్పందన వివరణలు, నమూనాలు ఉపకరిస్తాయి.'
- పెరిగిపోతున్న సమస్యాత్మక పోటీలో ప్రపంచంలోని వాస్తవాలు, అవకాశాల గురించి తెలియజేస్తుంది.
- మానవ భూగోళ శాస్త్ర అధ్యయనం సమాజాలు, దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారానికి మరింత సమర్థంగా సన్నద్ధం కావడానికి దోహదం చేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం