TS News: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ల్లో 1241 పోస్టులకు రాత పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలోని కేజీబీవీ/యూఆర్‌ఎస్‌లలో  1241 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published : 11 Aug 2023 16:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(URS)లో 1,241 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ సిబ్బందిని ఎంపిక చేసేందుకు జులైలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ర్యాంకు కార్డులను పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా.. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో 42 స్పెషల్‌ ఆఫీసర్, 849 పీజీ సీఆర్‌టీ, 273 సీఆర్‌టీ, 77 పీఈటీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జూన్‌ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. రాత పరీక్షలో, టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితాను విడుదల చేయనున్నారు. 

ర్యాంకు కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు