TS News: కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో 1241 పోస్టులకు రాత పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలోని కేజీబీవీ/యూఆర్ఎస్లలో 1241 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS)లో 1,241 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు జులైలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా.. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో 42 స్పెషల్ ఆఫీసర్, 849 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. రాత పరీక్షలో, టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితాను విడుదల చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ