SBI PO Results: ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఫేజ్‌-3 పరీక్ష తేదీలివే..!

ఎస్‌బీఐ పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

Updated : 11 Jan 2024 18:23 IST

SBI PO Mains Results | ముంబయి: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India)లో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల (PO) భర్తీకి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్‌బీఐ గురువారం విడుదల చేసింది. గతేడాది నవంబర్‌ 21న  ప్రిలిమ్స్‌ ఫలితాలు ప్రకటించిన అధికారులు.. డిసెంబర్‌ 5, 16 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సైకోమెట్రిక్‌ వంటి ఫేజ్‌-3 పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. సైకోమెట్రిక్‌ పరీక్ష జనవరి 16 నుంచి, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను  https://sbi.co.in/ లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని