SSC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 1324 జేఈ ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలివే..

Published : 27 Jul 2023 09:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (JE) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 1324 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే.. 

  • అర్హతలు: గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు. కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా తప్పనిసరి.
  • వయో పరిమితి: పోస్టులకు అనుగుణంగా కొన్ని పోస్టులకు 30 ఏళ్లు, మరికొన్నింటికి 32 ఏళ్లు వయో పరిమితి విధించారు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
  • వేతనం: ఏడో వేతన స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400  చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.100(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు)
  • దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 17, 18 తేదీల వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (పేపర్‌-1) జరిగే అవకాశం ఉంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలివే: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని