మామిడి మ్యూజియం
మామిడి తోటలు ఉన్నవాళ్లు పండ్లని మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతుంటారు. మరికొందరు విదేశాలకు ఎగుమతి కూడా చేస్తుంటారు. అవేమీ చేయకుండానే లక్షల్లో ఆదాయం పొందుతోంది గుజరాత్లోని గిర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం.
మామిడి తోటలు ఉన్నవాళ్లు పండ్లని మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతుంటారు. మరికొందరు విదేశాలకు ఎగుమతి కూడా చేస్తుంటారు. అవేమీ చేయకుండానే లక్షల్లో ఆదాయం పొందుతోంది గుజరాత్లోని గిర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం. నూర్ అలీ వీర్ ఝారియా తనకున్న పదిహేను ఎకరాల్లో మామిడి తోట వేశాడు. తోటంతా ఒకే రకం కాకుండా దాదాపు 300 రకాల మామిడి జాతులను నాటాడు. బంగినపల్లి, తోతాపురి, అల్ఫోన్సో, కొంకణ్, దశేరి తదితర దేశీయ రకాలతోపాటు అమెరికా, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూరప్లో పండే మామిడి జాతులను కూడా అక్కడ చూడొచ్చు. ఆ వైవిధ్యాన్ని అందరికీ చూపాలనుకున్న ఝారియా కుటుంబం.. వేసవిలో కాపు మొదలైనప్పట్నుంచీ ఆసక్తి ఉన్న వారిని తమ తోటకు ఆహ్వానిస్తోంది. మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచి, వచ్చిన వారికి వాటిని రుచి చూపించడం, ఆయా జాతుల గురించి వివరించడం చేస్తున్నారు. రకరకాల ఫెస్ట్లూ నిర్వహిస్తున్నారు. వాటికి ఎంట్రన్స్ టిక్కెట్లు, అడిగిన వారికి పండ్లను అమ్మడం ద్వారా ఝారియా కుటుంబం మామిడి సీజన్లో దాదాపు యాభైలక్షల రూపాయల ఆదాయం పొందుతోంది. సీజన్ చివర్లో మాత్రం మిగిలిన కాయల్ని ఊరంతా పంచి మామిడి పండగనూ జరుపుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!