దిగుబడికి డక్ ఆర్మీ!
రకరకాల పురుగులూ, నత్తలూ నీళ్లలో ఉండి వరి పంటకు హాని చేస్తుంటాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతుంటాయి. అందుకోసం రైతులు రసాయన ఎరువులను పిచికారీ చేయడం మనకు తెలిసిందే.
రకరకాల పురుగులూ, నత్తలూ నీళ్లలో ఉండి వరి పంటకు హాని చేస్తుంటాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతుంటాయి. అందుకోసం రైతులు రసాయన ఎరువులను పిచికారీ చేయడం మనకు తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో భూసారాన్ని దెబ్బతీసే హానికర ఎరువులకు బదులుగా బాతులను ఉపయోగిస్తున్నారు రైతులు. అదెలాగంటే... సహజంగా బాతులు నీటిమడుగుల్లోనూ, కాలవల్లోనూ, చెరువుల్లోనూ పురుగుల్ని పట్టి తింటుంటాయి. కాబట్టి వరి పొలంలో వీటిని వదలడం వల్ల నీళ్లలోని పురుగుల్నీ, నత్తల్నీ, తెగుళ్లనీ తినేస్తాయి. థాయ్లాండ్, తైవాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో ఇందుకోసమే కొందరు వేల సంఖ్యలో బాతుల్ని పెంచుతుంటారు. ‘డక్ ఆర్మీ’ పేరిట వీటిని రైతులకు అద్దెకిచ్చి... వరి పొలాల్లోకి వదులుతారు. ఇలా చేయడం వల్ల అటు బాతులను పెంచేవారికి ఆదాయం లభించడంతోపాటు దాణా ఖర్చూ మిగులుతుంది. ఇటు రైతులకు పురుగుమందులు వాడే బెడద తప్పడంతోపాటు భూసారం కూడా పెరిగి... ఏటికేడు దిగుబడి కూడా వృద్ధి అవుతోందట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM