ఈ జాతర మగవాళ్లకే!
ఏ గ్రామంలోనైనా జాతర లుంటే గ్రామస్థులు బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి ఆ జాతరలో పాల్గొని సంబరంగా వేడుకలు జరుపుకుంటారు.
ఏ గ్రామంలోనైనా జాతర లుంటే గ్రామస్థులు బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి ఆ జాతరలో పాల్గొని సంబరంగా వేడుకలు జరుపుకుంటారు. తమిళనాడులోని మదురై సమీపంలోని తిరుమంగళంలో జరిగే జాతరలో మాత్రం కేవలం మగవారే పాల్గొంటారు. బంధుమిత్రులెవర్నీ ఆహ్వానించకూడదు. ‘కిడావిరుందు’ పేరుతో వేసవిలో లేదంటే పంటలు వేయడానికి ముందు ఆ గ్రామంలో ఉన్న కరుంబారై ముత్తయ్య ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటారు. అందుకోసం నల్లమేకను పెంచి బలిస్తారు. ఏడాదికోసారి జరిగే ఆ జాతర వేళ తిరుమంగళంలోని పంట పొలాల్లో పెద్ద ఎత్తున మాంసాహారంతో విందుభోజనాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణహితంగా జరిగే ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా సహపంక్తి భోజనాల్లో పాల్గొంటారు. వారంతా భోజనాలు చేశాక అరటి ఆకుల్ని అక్కడే వదిలేస్తారు. అవి భూమిలో కలిసిపోయేవరకూ శుభ్రం చేయరు. అప్పటివరకూ గ్రామంలోని ఆడవాళ్లు ఆ వైపు వెళ్లరు. అలా చేయడం వల్ల తిరుమంగళానికి మంచి జరుగుతుందని తరతరాలుగా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి