Kolusu Parthasarathy: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కొలుసు పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 05 May 2025 16:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ సమాచారశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పింఛను అందించే బాధ్యత అధికారులదేనని చెప్పారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ‘‘రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ  రైతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది’’అని పార్థసారథి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని