Nara Lokesh: సచిన్ వినయం, మానవత్వం ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 03 Nov 2025 00:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్‌ కుటుంబ సభ్యులు కలిశారు. తన జీవితంలో ఇది ఒక ‘ఫ్యాన్ బాయ్ మోమెంట్’ అంటూ లోకేశ్‌ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సచిన్ వినయం, మానవత్వం గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని ప్రత్యక్షంగా చూడటం గర్వకారణమని పేర్కొన్నారు. తరతరాల క్రికెటర్లకు ప్రేరణగా నిలిచిన సచిన్, కేవలం క్రికెట్ దేవుడిగానే కాకుండా మానవత్వానికి ప్రతీక అని కొనియడారు. అనంతరం ఐసీసీ ఛైర్మన్‌ జైషా ఫ్యామిలీతోనూ లోకేశ్‌ కుటుంబం భేటీ అయింది. క్రికెట్‌, యువత భాగస్వామ్యం, భారత క్రీడా భవిష్యత్తుపై చర్చలు జరిగాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు