AP Govt: ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ఎన్టీఆర్‌ వైద్య సేవల పునరుద్ధరణ

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 31 Oct 2025 15:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమించిన యాజమాన్యాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వైద్యసేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపాయి. వెంటనే మరో రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం సమావేశమయ్యారు. నవంబర్‌ చివరికల్లా పెండింగ్‌ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైద్యసేవల పునరుద్ధరణకు యాజమాన్యాలు అంగీకరించాయి. 

బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించింది. అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నవంబర్‌ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని