AB Venkateswara Rao: పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ.
ఏబీ వెంకటేశ్వరరావుపై పగబట్టిన ప్రభుత్వం
ఐదేళ్లుగా సస్పెన్షన్లు, అక్రమ కేసులతో వేధింపులు
క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులవుతున్నా విధుల్లోకి తీసుకోలేదు
ఈ నెల 31న ఏబీవీ పదవీ విరమణ
అప్పటివరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ
అన్నీ తానై అమలుచేస్తున్న సీఎస్ జవహర్రెడ్డి
ఈనాడు, అమరావతి: ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలిచ్చి పది రోజులవుతున్నా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏబీవీ సస్పెన్షన్ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీఎస్ జవహర్రెడ్డి గురువారం ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు. సీజే అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదు. పోలింగ్ అనంతర హింసకు బాధ్యుడ్ని చేస్తూ ఈసీ తనపై చర్యలు తీసుకుంటే తన తర్వాత వచ్చే అధికారి ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేస్తారేమోనని సీఎస్ జవహర్రెడ్డి దిల్లీలో ఈసీ ఎదుట హాజరుకావడానికి ముందే... క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాలు చేశారనే అనుమానం ఐపీఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ఆయన సీఎస్ పోస్టులో లేకున్నా.. ఏబీవీకి పోస్టింగ్ రాకుండా అడ్డంకులు సృష్టించారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవంగా క్యాట్ ఆదేశాలను అమలు చేయకపోవడం ధిక్కారమే అవుతుంది.
సీఎస్కు దరఖాస్తు చేసుకుని వారం అవుతున్నా...
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ ఈ నెల 8న హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పు వెలువరించింది. ఆ ప్రతులు బయటకు రావడానికి మూడు రోజుల సమయం పట్టింది. ఆ వెంటనే సీఎస్ జవహర్రెడ్డిని ఏబీవీ కలిసి ఆ తీర్పు ప్రతితో పాటు, తనను విధుల్లోకి తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు. ఇది జరిగి వారం రోజులు దాటిపోయింది. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతి పొంది ఏబీవీని విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి. ఆ దస్త్రాన్ని ఎన్నికల సంఘానికి కాకుండా సీఎం జగన్కు పంపించినట్లు సమాచారం. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్కు కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ.. కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్కు అనుమతి తెచ్చారని సమాచారం.
పోస్టింగ్ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం
ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీసు మరో 13 రోజులే ఉంది. ఇలాంటి సందర్భాల్లో సీఎస్ స్థానంలో ఎవరున్నా క్యాట్ ఆదేశాలను ఆఘమేఘాలపై అమలుచేస్తారు. కానీ జవహర్రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం.. ఈ 13 రోజులు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా దురుద్దేశపూరిత జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోందన్న చర్చ ఐపీఎస్ వర్గాల్లో నడుస్తోంది. పదవీవిరమణ చేసేవరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడ దీని వెనక ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్యాట్ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్లేదు. చివరికి విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏబీవీ, ఆయన సతీమణి కవిత ఓట్లనూ తొలగించేశారు. ప్రభుత్వ ఫ్యాక్షనిజం వల్ల ఇప్పటికే అత్యంత విలువైన కాలాన్ని, సర్వీసును కోల్పోయిన ఏబీవీకి.. పదవీకాలం చివర్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు(6)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?