Andhra Pradesh: కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే ప్రక్షాళన మొదలు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే... వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది.
అవినీతికి కేంద్రాలైన గనులు, ఎక్సైజ్ శాఖలపై ప్రత్యేకదృష్టి
వివాదాస్పద అధికారులపై వరుసగా బదిలీ వేటు
కీలకపత్రాలు, దస్త్రాలు నాశనం చేయకుండా చర్యలు
అధికారులెవరినీ రిలీవ్ చేసి పంపొద్దని ఆదేశాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయక ముందే... వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ, అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు వేయడం, డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు ఈ హడావుడిలో రిలీవై వెళ్లిపోకుండా నిరోధించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. వైకాపా హయాంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు, వివాదాలకు నిలయాలైన ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ముఖ్యమైన దస్త్రాల్ని, పత్రాల్ని నాశనం చేయకుండా నిరోధించే చర్యలు మొదలయ్యాయి. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి దస్త్రాలు, పత్రాలేవీ బయటకు వెళ్లకుండా చూడాలని, భద్రపరచాలని గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. మరోపక్క చంద్రబాబు ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పరుగులు తీయడం మొదలుపెట్టింది. వైకాపాతో అంటకాగుతూ, పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసిన సీఎస్ జవహర్రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన గనులశాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డి, ఏపీ ఫైబర్నెట్ ఎండీ మధుసూదన్రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురామ్రెడ్డిపై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో రూ.వేల కోట్ల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు, ఎక్సైజ్శాఖలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దస్త్రాలు, కీలక డాక్యుమెంట్లు తస్కరించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదుచేసింది. గత ఐదేళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఐదేళ్ల జగన్ పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గాడిన పెట్టాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం. ఆ సంకేతాలకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది.
..అప్పుడే సర్దుకుంటే ఎలా? ఆగండి!
జగన్ ప్రభుత్వం కేంద్రం, ఇతర రాస్త్రాల నుంచి అస్మదీయులు, దాదాపుగా ఒకే సామాజికవర్గానికి చెందిన పలువురిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి, అర్హత లేకపోయినా కీలక బాధ్యతలు అప్పగించింది. వారిలో చాలామంది ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. కొందరు ఎన్నికల ఫలితాలు రాగానే సర్దుకునే ప్రయత్నం చేస్తారని.. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరేవరకూ ఎవరినీ బదిలీ చేయవద్దని, సెలవుపై వెళతామన్నా అనుమతులు ఇవ్వవద్దని, రిలీవ్ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ తనను రిలీవ్ చేస్తే వెళ్లిపోతానని కోరినా... కుదరదని స్పష్టం చేసినట్టు తెలిసింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున అధికారుల ప్రక్షాళన ఉంటుంది.
రాజధాని పనుల్లో కదలిక
రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, దాన్నో చిట్టడివిలా మార్చేసిన సీఆర్డీఏలో కదలిక మొదలైంది. రాజధానిలో పిచ్చిమొక్కలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రాజధానికి ప్రమాణస్వీకారం చేసినచోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైకాపా హయాంలో దుండగులు ధ్వంసం చేసినా చీమకుట్టినట్టయినా లేని సీఆర్డీఏ అధికారులు... ఆదివారం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, గ్యాలరీని పునరుద్ధరించే పనులు హుటాహుటిన చేస్తున్నారు. సీఎస్ నీరభ్కుమార్ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు.
సమీక్షలకు ప్రభుత్వశాఖల సన్నద్ధత
చంద్రబాబు పరిపాలన శైలి, అధికారుల్ని ఆయన పరుగులు పెట్టించే విధానం గురించి బాగా తెలిసిన వివిధ ప్రభుత్వశాఖలు... కొత్త ప్రభుత్వం కొలువుతీరగానే ఆయన చేపట్టే సమీక్షలకు సిద్ధమవుతున్నాయి. నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులో వ్యవహారాలపై జలవనరులశాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశమున్నందున, ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కోల పరిస్థితిపైనా సమాచారం తెప్పించుకున్నారు. చాలాచోట్ల వీధిదీపాలు వెలగడం లేదని తెలుసుకుని, వెంటనే పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు ఆయన సూచించినట్టు సమాచారం.
గనులు, ఎక్సైజ్ శాఖల్లో ప్రకంపనలు
వైకాపా పాలనలో అత్యంత వివాదాలకు, అవినీతికి నిలయాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులు, ఎక్సైజ్ శాఖలపై ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వం దృష్టిపెట్టింది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపాకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు... ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. ఆయన ఈ నెల 6న సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాల్ని కారులో దొంగతనంగా తరలిస్తుండగా చూశానని కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదుచేయడంతో సీఐడీ కేసు నమోదుచేసింది. శుక్రవారం సీఐడీ బృందాలు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించాయి. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, వారి అస్మదీయులు మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని, జే బ్రాండ్ మద్యంతో భారీగా దోచుకున్నారు. ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో... ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించినట్టు సీఐడీ గుర్తించింది.
- ఇండియన్ కోస్ట్గార్డ్ సర్వీసెస్కి చెందిన వెంకట్రెడ్డిని జగన్ ప్రభుత్వం డిప్యుటేషన్పై తీసుకొచ్చి గనులశాఖ సంచాలకుడిని చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వెంకట్రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయన అడ్డగోలుగా సహకరించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీకి ఇన్ఛార్జి ఎండీగా హవా చలాయించిన వెంకట్రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆ వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్కి చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇబ్రహీంపట్నంలోని గనులశాఖ సంచాలకుడి కార్యాలయానికి, రాత్రి ఒంటిగంట సమయంలో ఏపీఎండీసీ కార్యాలయానికి వెళ్లి, తనిఖీలు నిర్వహించారు. దస్త్రాలు, హార్డ్కాపీలు ఉన్నాయో, లేదో సరిచూసుకుని తాళాలు వేశారు.
- ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతో పాటు, తమ అవినీతిని, అక్రమాల్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి, వేధించేందుకు జగన్ ప్రభుత్వం సాధనంగా వాడుకున్న సీఐడీ, సిట్ కార్యాలయాలపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. అక్కడి పత్రాలేవీ బయటకు వెళ్లకుండా వాటికి తాళాలు వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
మడ అడవుల పరిరక్షణకు ప్రత్యేక విభాగం
మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. -
పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు నమోదుకు షెడ్యూల్ ఖరారు
తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. -
ఇలాంటివి మీ ఇంట్లో తింటారా టీచర్!
తిరుపతి జిల్లాలోని బీఎన్కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల వంట గదిలో కుళ్లిన క్యాబేజీ, అరటిపండ్లు కనిపించాయి. శుక్రవారం మండలస్థాయి అధికారులు తనిఖీ చేసి అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. -
సంక్షిప్త వార్తలు(6)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?