JJM Works: ఏపీ సర్కారు మొద్దునిద్రతో రూ.5,736 కోట్లకు గండి!
కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతుంది. వివిధ పథకాల కింద వీలైనంత రాబట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు దిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తుంటాయి.
వాటా నిధులు ఇవ్వకపోవడంతో జేజేఎం నిధులు కోల్పోయిన రాష్ట్రం
ఐదేళ్లలో చేసిన పనుల విలువ రూ.4,200 కోట్లే
ఈనాడు, అమరావతి: కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతుంది. వివిధ పథకాల కింద వీలైనంత రాబట్టుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు దిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తుంటాయి. మన రాష్ట్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా.. నిర్లక్ష్య ధోరణి చూపింది. జలజీవన్ మిషన్ (జేజేఎం) పథకం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకోలేదు. ఫలితంగా గత రెండేళ్లలో రూ.5,736.92 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత నీటిని అందించాలని జేజేఎం పథకం కింద కేంద్రం నిధులిస్తోంది. 2019-29లో రాష్ట్రానికి రూ.15,300 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు మంజూరుచేసింది. రాష్ట్రవాటాగా 50% నిధులు సమకూరిస్తే.. కేటాయించిన దాంట్లోంచి కేంద్రం అంతే మొత్తంలో విడుదల చేస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చడంలో మొదటి నుంచీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి రూ.10,200 కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నా గత ఐదేళ్లలో రూ.4,200 కోట్ల విలువైనవే పూర్తి చేయగలిగింది. ఇంత జరిగినా కేంద్రం ఏటా రాష్ట్రానికి నిధులు వినియోగించుకోవాలని గుర్తుచేస్తూనే ఉంది. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో జేజేఎం పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లుల జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేస్తున్నారు.
నిధులిచ్చినా వినియోగించుకోలేని దుస్థితి
జేజేఎం నిధులు వినియోగించుకోవడంలో మిగతా రాష్ట్రాలు పోటీపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ చొరవ కనిపించడం లేదు. 2022-23లో కేంద్రం కేటాయించిన నిధుల్లో ఏపీ ఒక్క రూపాయీ ఉపయోగించుకోలేదు. ఆ ఏడాది కేంద్రం రూ.3,458.20 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం వాటిని పక్కన పెట్టింది. మొదటివిడత నిధులు సింగిల్ నోడల్ ఎకౌంట్లో రాష్ట్రం జమచేస్తే... తమ వాటా ఇస్తామని కేంద్రం చెప్పినా పట్టించుకునే దిక్కే లేదు.
రెండేళ్ల నిధులు ఒకేసారి ఇచ్చినా అదే నిర్లక్ష్యం
వివిధ కారణాలతో 2022-23లో నిధులు వినియోగించుకోలేపోయామన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ ఏడాది నిధులతోపాటు 2023-24కు సంబంధించినవీ కలిపి రూ.6,530.49 కోట్లు కేటాయించింది. వీటి ఉపయోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. తొలుత తన వాటాగా రూ.793.57 కోట్లు విడుదల చేయడంతో ఈ ఏడాది మార్చి చివరినాటికి కేంద్రం కూడా అంతే మొత్తం విడుదల చేసింది. మిగతావీ ఇస్తాం.. రాష్ట్ర వాటా విడుదల చేయాలని కేంద్రం సూచించినా ఫలితం లేకపోయింది. దీంతో రెండేళ్లకు కేంద్రం కేటాయించిన నిధుల్లో నుంచి రూ.5,736.92 కోట్లు రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇదే పథకానికి 2024-25లో కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. -
బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు
తితిదే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మరొకరికి బాధ్యతలు అప్పగించక ముందే గుట్టుగా తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, సామగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. -
నేడు చంద్రబాబు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. -
తాడేపల్లిలో ప్రజలకు తీరిన ‘దారి’ కష్టాలు!
తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. -
బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
‘అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. -
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
‘కర్మ’ఫలం ఇది.. అని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ గత వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుంది.. అని నేను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారు’ అని ఆదివారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడిఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకొంది. -
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్) ఉపాధ్యాయులు ఆరోపించారు. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
జనం సొమ్ముతో... జగన్ మాయామహల్
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం..! అయితే... -
గత మాస్టర్ప్లాన్ ప్రకారమే రాజధాని
గతంలో రూపొందించిన మాస్టర్ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. -
పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!
జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్నిచోట్ల బడులు మూతపడుతున్నాయి. -
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి.. అనుమానితుణ్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించినా కేసు నమోదు చేయకపోగా, బాధితునితో సీఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
రూ.2,100 కోట్లు దారి మళ్లింపు
ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే. -
వెన్నెముక శస్త్రచికిత్స వైద్యునికి అంతర్జాతీయ అవార్డు
వెన్నులోని డిస్కులకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు ప్రతిష్ఠాత్మక ‘ఐఎస్ఎస్ఎల్ఎస్ ప్రైజ్’ అవార్డు దక్కింది. -
క్రీడాశాఖలో అవినీతిని బయటికి తీస్తాం: మంత్రి రాంప్రసాదరెడ్డి
‘రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో క్రీడాశాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. అవినీతిపరులను శిక్షిస్తాం. ప్రభుత్వం సొమ్మును తిరిగి రాబడుతాం’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. -
ప్రవీణ్ప్రకాష్ను బదిలీ చేయాలి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ను బదిలీ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. -
చిన్న పరిశ్రమల కష్టాలపై కసరత్తు
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సంఖ్యను గుర్తించి.. క్షేత్రస్థాయిలో అవి ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోడానికి చేపట్టిన ‘రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)’ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
జనం సొమ్ముతో జగన్ సోకులు
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. -
రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు!
నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎంకు కృతజ్ఞతలు
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
-
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
-
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే..సీఎం కీలక నిర్ణయం