prevention Of Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణ పట్టని ప్రభుత్వం
ఈ నెల 13న పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో టూరిస్టు బస్సు.. టిప్పర్ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు.
రహదారి భద్రతకు ఐదేళ్లలో రూ.500 కోట్ల కేటాయింపు
ఖర్చు చేసింది కేవలం రూ.10 కోట్లే
అది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమీక్ష నేపథ్యంలోనే..
సమావేశాలతో సరి.. నిధులిచ్చేది లేదు మరి
దిష్టిబొమ్మల్లా.. రహదారి భద్రత కమిటీలు
ఈనాడు, అమరావతి: ఈ నెల 13న పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో టూరిస్టు బస్సు.. టిప్పర్ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. డ్రైవర్కు బదులు క్లీనర్ బస్సును వేగంగా నడపడమే దీనికి కారణం. ఈ నెల 18న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి, హైవేలో డివైడర్ దాటి ఎదురురోడ్డులోకి వెళ్లి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ నెల 23న కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ట్రావెల్స్ బస్ అతివేగంగా వెళ్తూ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఇలా నిత్యం వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడా తనిఖీలు, నిఘా ఉండటం లేదు. వాహనాలు అతి వేగంగా వెళ్లకుండా నియంత్రించలేకపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేస్తున్నా సరే.. ప్రమాదం జరిగాక గానీ గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి ప్రమాదాల నియంత్రణకే రహదారి భద్రత విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉండే ఈ విభాగానికి చెందిన కమిటీలు.. ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలి. ఈ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే వాటి అమలుకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. ఐదేళ్లుగా ప్రమాదాల్లో వేల మంది మరణిస్తున్నా.. వైకాపా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. రహదారి భద్రతకు బడ్జెట్లో ఏటా రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.500 కోట్లు కేటాయించినా.. కేవలం రూ.10 కోట్లు మాత్రమే విడుదల చేసిందంటే ఈ ప్రభుత్వానికి ప్రమాదాల నియంత్రణపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.
పేరుకే నిధుల కేటాయింపు
- రహదారి భద్రత కమిటీల్లో రవాణా, పోలీస్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, వైద్య-ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు ఉంటారు.
- జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఉండే కమిటీ.. ప్రతి నెలా సమావేశమై, ఎన్ని ప్రమాదాలు జరిగాయి, వాటికి కారణాలేంటి, నియంత్రణకు ఏం చేయాలనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడైనా నిధులు వెచ్చించాల్సి వస్తే.. ఆ ప్రతిపాదనను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపుతుంది.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ ఏటా రెండుసార్లు సమావేశమై.. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి వాటికి నిధులు కేటాయించాలి.
- జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల సమావేశాలు జరిగినా నిధుల విడుదల మాత్రం ఉండటం లేదు.
- రహదారి భద్రతకు ప్రభుత్వం బడ్జెట్లో ఏటా రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లుగా కేటాయిస్తూ వచ్చింది. మద్యం తాగి, వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్లు, వాహన వేగాన్ని గుర్తించి, జరిమానాలు విధించేందుకు అవసరమైన స్పీడ్ గన్స్, ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యల కోసం క్రేన్ల వంటివి పోలీస్, రవాణా శాఖలు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఇవ్వాలి.
- ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, అక్కడ తగిన పనులు చేసేందుకు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాల్లో సైన్బోర్డులు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు నిధులివ్వాలి.
- పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలి.
- రవాణాశాఖకు లైసెన్సుల జారీ, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు తదితరాల నిర్వహణకు కొత్త పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించాలి.
- కానీ వేటికీ జగన్ ప్రభుత్వం అయిదేళ్లలో డబ్బులు విడుదల చేయలేదు. దీంతో రహదారి భద్రత విభాగం కేవలం ప్రేక్షకపాత్ర పోషించడానికి, ప్రమాదాల జాబితా రూపొందించేందుకే పరిమితమైంది.
న్యాయమూర్తి ప్రశ్నిస్తారని.. నిధుల విడుదల
రాష్ట్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏడు చోట్ల ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అవసరమైన పరికరాలను రహదారి భద్రత నిధి నుంచే కొనుగోలు చేశారు. దాదాపు ఏడాదిన్నర కిందట గుత్తేదారు వాటిని సరఫరా చేశారు. వాటి సొమ్ము ఇస్తేనే.. పరికరాలు బిగిస్తానని గుత్తేదారు చెబుతున్నా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రెండు నెలల కిందట ఆఘమేఘాలపై ఆ నిధులు విడుదల చేశారు. వివిధ ప్రాంతాల్లో రహదారి భద్రత కింద చేసిన పనులు, కొనుగోలు చేసిన పరికరాలకు ఇంతకాలం బకాయిలు చెల్లించలేదు. వీటికి కూడా రెండు నెలల కిందట నిధులు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన రహదారి భద్రత, ఆడిట్పై ఈ ఏడాది మార్చి 15న సమావేశం జరిగింది. ఆడిట్ వివరాలు పరిశీలించి.. ఇంతకాలం బకాయిలు ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తారనే భయంతో ఆ సమావేశానికి ముందే రూ.10 కోట్ల బకాయిలు విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..