AP High Court: 6 వరకు అరెస్టు వద్దు
ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ
కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్రెడ్డిలకూ ఉపశమనం
నలుగురి కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు
వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం
ఈనాడు - అమరావతి
ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6 వరకు వారిని అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వులతో ఉపశమనం పొందినవారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి న్యాయస్థానం రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు స్పష్టం చేశారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలుచేయాలని పేర్కొంటూ విచారణను జూన్ 6కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని అక్కడి వైకాపా, తెదేపా అభ్యర్థులకు షరతు విధించారు.
మాచర్ల నియోజకవర్గం పరిధి పాల్వాయిగేటులోని ఓ పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో రెంటచింతల పోలీసులు తనపై నమోదుచేసిన కేసులలో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలుచేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఘటనపై ప్రతిపక్ష నేత నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఆ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిగణనలోకి తీసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్పై నమోదుచేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవే. ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు అర్నేష్కుమార్ కేసులో స్పష్టం చేసినా.. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయి. అలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ఈసీకి లేదు. పిటిషనర్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఓట్ల లెక్కింపు వరకూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలి’’ అని వాదించారు.
బెయిల్ ఇవ్వవద్దు
- పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో తెదేపా ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిన్నెల్లికి బెయిలు మంజూరు చేయొద్దని కోరారు. ఆయన అల్లర్లు సృష్టించారని, పిటిషనర్పై దాడిచేసి గాయపరిచారని చెప్పారు. బాధితుడిగా వాదనలు చెప్పుకొనేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
- దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
- తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ షరతులు విధిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థి పరిమి సోమశేఖర్ నాయుడి తరఫున న్యాయవాది చుక్కపల్లి భానుప్రసాద్ వాదనలు వినిపించారు.
- పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో నేర ఘటనలు పునరావృతం చేయకుండా పిటిషనర్లను/అభ్యర్థులను ఆదేశించాలని కోరారు. అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఆదేశించాలని కోరారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే.. ఆ ఉత్తర్వులను పోటీచేసే అభ్యర్థులకే పరిమితం చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల