AP High Court: పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధిస్తూ, కోర్టుల ఉత్తర్వులనూ పెడచెవిన పెట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య
క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి
ఈనాడు, అమరావతి: డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధిస్తూ, కోర్టుల ఉత్తర్వులనూ పెడచెవిన పెట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవీవిరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రప్రభుత్వం ఆయనను దాదాపు ఐదేళ్లుగా సస్పెన్షన్లోనే ఉంచిందని గుర్తుచేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాల్ని ఈ దశలో నిలుపుదల చేస్తే... అది ఏబీవీకి తీవ్రనష్టం కలగజేస్తుందని జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ పి.జ్యోతిర్మయిలతో కూడిన హైకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల... ఏబీవీపై ప్రభుత్వం మోపిన అభియోగాల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని కోర్టు పేర్కొంది.
ఏబీవీకి పోస్టింగ్ ఇస్తే దర్యాప్తును ఆయన ప్రభావితం చేస్తారన్న రాష్ట్రప్రభుత్వ వాదన పసలేనిదిగా కొట్టిపారేసింది. ఏబీవీపై సస్పెన్షన్ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్పై... ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాక తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. జూన్ 20న కోర్టు వేసవి సెలవులు ముగిసిన వెంటనే అనుబంధ పిటిషన్పై విచారిస్తామని తెలిపింది. ఏబీవీపై సస్పెన్షన్ను ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఇచ్చిన తీర్పు తప్పులతడకగా ఉందని, వాస్తవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటిని విస్మరించిందని ఆ పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది.
ఆ రికార్డులన్నీ హైకోర్టు స్వాధీనం చేసుకుని పరిశీలించాలని, లోతైన విచారణ జరిపించాలని కోరింది. ఆలోగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని మరో అనుబంధ పిటిషన్ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏబీవీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఆయన సహాయకుడు ఎం.రాజీవ్కుమార్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనుబంధ పిటిషన్పై హైకోర్టు బెంచ్ గురువారం ఉత్తర్వులు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆ ఆందోళన అర్థరహితం
‘‘ఏబీవీ మే 31న పదవీవిరమణ చేస్తున్నారని ఏజీ చెబుతున్నారు. అలాంటప్పుడు క్యాట్ ఆదేశాల మేరకు ఆయనను సర్వీసులో చేర్చుకుని, పోస్టింగ్ ఇవ్వడం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, దర్యాప్తునకు అవరోధం కలిగిస్తారన్న ఆందోళన అర్థరహితం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఏబీవీ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం మా దృష్టిలో ఉంది. కానీ ఆయనను సర్వీసులో చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అడ్డం కాదు. ఆయనపై చట్టప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించేందుకు ఎలాంటి అవరోధం ఉండదు. సాధారణంగా ఒక ఉద్యోగిపై విచారణ జరుగుతున్నప్పుడు ఆయన దానికి అవరోధాలు సృష్టిస్తారని, సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో సస్పెండ్ చేస్తారు. కానీ ఏబీవీ ముందస్తు బెయిల్ పొందాక... దాన్ని రద్దుచేయాల్సిందిగా కోరుతూ ప్రాసిక్యూషన్ ఇంతవరకు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. ఆయన అలాంటి చర్యలకు పాల్పడలేదనడానికి అదే నిదర్శనం’’ అని కోర్టు పేర్కొంది. సుదీర్ఘమైన సర్వీసు కలిగిన, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీవీకి సంబంధించి క్యాట్ ఉత్తర్వుల్ని అమలుచేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
‘‘ఏబీవీ 1989లో సర్వీసులో చేరారు. 2015 జులై 6న నిఘా విభాగం అదనపు డీజీగా నియమితులయ్యారు. 2019 మార్చి 10న డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయనను బదిలీ చేసి, 2019 ఏప్రిల్ 22న ఏసీబీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన సస్పెన్షన్ ఎత్తేస్తూ పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు 2022 ఏప్రిల్ 22న ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం 2022 జూన్ 14న ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చింది. 2022 జూన్ 17న ఆయన బాధ్యతలు చేపట్టారు. మళ్లీ రాష్ట్రప్రభుత్వం జీఓ55 ద్వారా ఆయనను 2022 జూన్ 28న సస్పెండ్ చేసింది. ఆయన దాదాపు ఐదేళ్లు సస్పెన్షన్లో ఉన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనను సర్వీసులో చేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు’’ అని కోర్టు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు