AP News: గడప గడపలో సమస్యల గళం
గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు.
హామీలపై స్పీకర్ను నిలదీసిన మహిళలు
అడ్డమైన పథకాలు పెట్టారంటూ తిరువూరులో నిరసన
ఇసుక తవ్వకాలపై తిరుపతిలో మండిపాటు
న్యూస్టుడే, బృందం: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు.
పంచాయతీ సరే... చెక్ పవర్ ఏదీ?
శ్రీకాకుళం జిల్లా డొంకలపర్త పంచాయతీ పరిధిలోని తుడ్డలిని ప్రత్యేక పంచాయతీగా మార్చారని, చెక్పవర్ ఎందుకు ఇవ్వలేదని స్పీకర్ తమ్మినేని సీతారాంను సర్పంచి అంపిలి రూపావతి నిలదీశారు. గ్రామంలో అపరిశుభ్రత తాండవిస్తోందని, రోడ్లు, కాలువలను నిర్మించాల్సి ఉందన్నారు. ‘ఎన్నికల సమయంలో వీధి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. నేటికీ సమస్య అలాగే ఉంది. ఇంటి పట్టా ఉన్నా స్థలం ఎక్కడో తెలియదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించడం లేదు’ అంటూ మహిళలు ప్రశ్నించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
* ‘మత్స్యకార భరోసా కొందరికే వచ్చింది. అర్హులందరికీ ఇవ్వాలిందే’నని మందస మండలం మర్రిపాడులో మంత్రి సీదిరి అప్పలరాజును మహిళలు అడ్డుకున్నారు.
ఇసుక రేవులపై నిలదీత
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం చిన్నాపట్టు, అచ్చమనాయుడుకండ్రిగ, సుబ్బానాయుడుకండ్రిగ, నందనం గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇసుక రేవుల అంశంపై గ్రామస్థులు నిలదీశారు.
పంథా మార్చిన నాయకులు
ప్రజాప్రతినిధులను చాలాచోట్ల ప్రజలు నిలదీస్తుండటంతో వైకాపా నాయకులు పంథా మార్చారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మూడో వార్డు శాంతినగర్లో సోమవారం హిందూపురం ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ పర్యటించారు. వారి రాకకు ముందే వాలంటీర్లు, ముఖ్య కార్యకర్తలు... ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిలదీసే వారిని గుర్తించి... నాయకుల వద్ద గట్టిగా మాట్లాడకుండా చేశారు. ఈ తతంగాన్ని శాంతినగర్లో సోమవారం వీడియో తీయడానికి మీడియా ప్రతినిధి ఒకరు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని.. ఆయన జేబులోనే పెట్టారు. మరో నాయకుడు విలేకర్లపై దూషణలకు దిగగా మిగిలిన నాయకులు ఆయనకు సర్దిచెప్పారు. అనంతరం విలేకర్లు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ రోడ్డుపై ఎలా నడిచేది?
‘వర్షం వస్తే దారంతా బురదమయం అవుతుంది. మేం ఈ రోడ్డుపై ఎలా నడిచేది’ అంటూ కర్నూలు జిల్లా ఆదోని మండలం విరూపాపురంలో పార్వతి, జయలక్ష్మి అనే మహిళలు స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని ప్రశ్నించారు. గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధికి మూడు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, తమకు మాత్రం నీరు రావడం లేదని ఒకరు ఆరోపించారు.
మద్దతు ధర ఎక్కడుంది సారూ...
‘రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెబుతున్నారు. నేను మొక్కజొన్న వేశా. మద్దతు ధరకు విక్రయిద్దామంటే హమాలీ, సంచులు, పురుకోసుల ఖర్చులు, లారీ బాడుగలు మేమే చెల్లించాలి. ఇవన్నీపోను రైతుకు మిగిలేది ఏముంది’ అంటూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లికి చెందిన ఓ రైతు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ను నిలదీశారు.
నా కుమారుడికీ అమ్మఒడి రాలేదు
‘నా కుమారుడికీ అమ్మ ఒడి రాలేదు. మంజూరు చేయించండి’ అని కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం రంగాపురంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కుంభళనూరు సర్పంచి లక్ష్మి వాపోయారు.
ముఖ్యమైన పనులను వదిలేశారు
‘అడ్డమైన పథకాలన్నీ అమలు చేశారు. ముఖ్యమైన పనులేమీ చేయలేదు. రోడ్లు, ఇళ్లు ముఖ్యం. 40 ఏళ్ల వాళ్లకి, మిషన్ కుట్టే వాళ్లకి, ఆటో వాళ్లకు డబ్బులు ఇవ్వడం దేనికి? ముఖ్యమైన పనులు చేయకుండా వదిలేశారు... వర్షం పడితే రోడ్డుపైకి మోకాళ్లలోతు వరకు నీళ్లొస్తున్నాయి’ అంటూ ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరుకు చెందిన కోట వరమ్మ తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధిని నిలదీశారు.కిడ్నీ వ్యాధితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధరలు తగ్గించే మార్గం చూడండి
‘గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయి. తగ్గించే మార్గం చూపండి’ అని వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది