AP News: గడప గడపలో సమస్యల గళం
గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు.
హామీలపై స్పీకర్ను నిలదీసిన మహిళలు
అడ్డమైన పథకాలు పెట్టారంటూ తిరువూరులో నిరసన
ఇసుక తవ్వకాలపై తిరుపతిలో మండిపాటు
న్యూస్టుడే, బృందం: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు.
పంచాయతీ సరే... చెక్ పవర్ ఏదీ?
శ్రీకాకుళం జిల్లా డొంకలపర్త పంచాయతీ పరిధిలోని తుడ్డలిని ప్రత్యేక పంచాయతీగా మార్చారని, చెక్పవర్ ఎందుకు ఇవ్వలేదని స్పీకర్ తమ్మినేని సీతారాంను సర్పంచి అంపిలి రూపావతి నిలదీశారు. గ్రామంలో అపరిశుభ్రత తాండవిస్తోందని, రోడ్లు, కాలువలను నిర్మించాల్సి ఉందన్నారు. ‘ఎన్నికల సమయంలో వీధి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. నేటికీ సమస్య అలాగే ఉంది. ఇంటి పట్టా ఉన్నా స్థలం ఎక్కడో తెలియదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించడం లేదు’ అంటూ మహిళలు ప్రశ్నించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
* ‘మత్స్యకార భరోసా కొందరికే వచ్చింది. అర్హులందరికీ ఇవ్వాలిందే’నని మందస మండలం మర్రిపాడులో మంత్రి సీదిరి అప్పలరాజును మహిళలు అడ్డుకున్నారు.
ఇసుక రేవులపై నిలదీత
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం చిన్నాపట్టు, అచ్చమనాయుడుకండ్రిగ, సుబ్బానాయుడుకండ్రిగ, నందనం గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇసుక రేవుల అంశంపై గ్రామస్థులు నిలదీశారు.
పంథా మార్చిన నాయకులు
ప్రజాప్రతినిధులను చాలాచోట్ల ప్రజలు నిలదీస్తుండటంతో వైకాపా నాయకులు పంథా మార్చారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మూడో వార్డు శాంతినగర్లో సోమవారం హిందూపురం ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ పర్యటించారు. వారి రాకకు ముందే వాలంటీర్లు, ముఖ్య కార్యకర్తలు... ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిలదీసే వారిని గుర్తించి... నాయకుల వద్ద గట్టిగా మాట్లాడకుండా చేశారు. ఈ తతంగాన్ని శాంతినగర్లో సోమవారం వీడియో తీయడానికి మీడియా ప్రతినిధి ఒకరు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని.. ఆయన జేబులోనే పెట్టారు. మరో నాయకుడు విలేకర్లపై దూషణలకు దిగగా మిగిలిన నాయకులు ఆయనకు సర్దిచెప్పారు. అనంతరం విలేకర్లు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ రోడ్డుపై ఎలా నడిచేది?
‘వర్షం వస్తే దారంతా బురదమయం అవుతుంది. మేం ఈ రోడ్డుపై ఎలా నడిచేది’ అంటూ కర్నూలు జిల్లా ఆదోని మండలం విరూపాపురంలో పార్వతి, జయలక్ష్మి అనే మహిళలు స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డిని ప్రశ్నించారు. గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధికి మూడు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, తమకు మాత్రం నీరు రావడం లేదని ఒకరు ఆరోపించారు.
మద్దతు ధర ఎక్కడుంది సారూ...
‘రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెబుతున్నారు. నేను మొక్కజొన్న వేశా. మద్దతు ధరకు విక్రయిద్దామంటే హమాలీ, సంచులు, పురుకోసుల ఖర్చులు, లారీ బాడుగలు మేమే చెల్లించాలి. ఇవన్నీపోను రైతుకు మిగిలేది ఏముంది’ అంటూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లికి చెందిన ఓ రైతు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ను నిలదీశారు.
నా కుమారుడికీ అమ్మఒడి రాలేదు
‘నా కుమారుడికీ అమ్మ ఒడి రాలేదు. మంజూరు చేయించండి’ అని కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం రంగాపురంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కుంభళనూరు సర్పంచి లక్ష్మి వాపోయారు.
ముఖ్యమైన పనులను వదిలేశారు
‘అడ్డమైన పథకాలన్నీ అమలు చేశారు. ముఖ్యమైన పనులేమీ చేయలేదు. రోడ్లు, ఇళ్లు ముఖ్యం. 40 ఏళ్ల వాళ్లకి, మిషన్ కుట్టే వాళ్లకి, ఆటో వాళ్లకు డబ్బులు ఇవ్వడం దేనికి? ముఖ్యమైన పనులు చేయకుండా వదిలేశారు... వర్షం పడితే రోడ్డుపైకి మోకాళ్లలోతు వరకు నీళ్లొస్తున్నాయి’ అంటూ ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరుకు చెందిన కోట వరమ్మ తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధిని నిలదీశారు.కిడ్నీ వ్యాధితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధరలు తగ్గించే మార్గం చూడండి
‘గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయి. తగ్గించే మార్గం చూపండి’ అని వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం