Andhra Pradesh News: రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు.
న్యూసెన్స్ కేసు పెడతామంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేశారని బాధితుల ఆరోపణ
వైకాపా మూకల దాడిని వక్రీకరిస్తారా?
విశాఖ కంచరపాలెం పోలీసుల తీరు దారుణం
ఓటేయలేదన్న కక్షతోనే ఇష్టారాజ్యంగా కొట్టారంటున్న బాధితులు
దాడి సంఘటనను వివరిస్తున్న ధనలక్ష్మి.. చిత్రంలో బాధిత కుటుంబ సభ్యులు
ఈనాడు, విశాఖపట్నం: తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. నిండు గర్భిణి అని చూడకుండా కాళ్లతో తన్ని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఈ చర్య ప్రశాంత విశాఖను ఉలికిపాటుకు గురిచేసింది. మరోవైపు కుటుంబ గొడవలంటూ పోలీసులు తప్పుదోవ పట్టించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. దాడి గురించి పోలీసుస్టేషన్కు వెంటనే ఫోన్ చేసి చెప్పినప్పటికీ గంట ఆలస్యంగా వచ్చారని, కనీస చర్యలూ చేపట్టలేదని బాధితులు వాపోతున్నారు. స్టేషన్నుంచి రావడానికి పది నిమిషాలే పడుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు.
గంటపాటు రక్తపుమడుగులోనే గడిపామని భయంకర క్షణాలను కళ్లకు కట్టారు. చివరకు తామే 108కి ఫోన్ చేశామని విలపించారు. తలపై రక్తగాయాలతో స్పృహ కోల్పోతున్న ఒకరి స్టేట్మెంటు ఆధారంగా ఇష్టారీతిన ఎఫ్ఐఆర్ రాసేశారని, ‘మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదు’ అంటే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ కంచరపాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులు శుక్రవారం మీడియా ఎదుట వాపోయారు.
ఇంటి పలకతో మొదలై.. కూటమికి ఓటేశారని.
జీవీఎంసీ 49వ వార్డు బర్మా క్యాంపులో సుంకర ధనలక్ష్మి కుటుంబం నివసిస్తోంది. తెదేపా హయాంలో పీఎంఏవై కింద ధనలక్ష్మికి ఇల్లు మంజూరైంది. ఇంటిపై చంద్రబాబు, విష్ణుకుమార్రాజు ఫొటోలతో పలక ఉంది. వార్డు వైకాపా నాయకుల హెచ్చరికల మేరకు దానిపై ఇటీవల పేపరు అంటించారు. కొన్ని రోజులకు అది గాలికి కొట్టుకుపోయింది. ఎన్నికల ముందు రోజు 12వ తేదీ రాత్రి డబ్బులిచ్చేందుకు ధనలక్ష్మి కుటుంబసభ్యులను స్థానిక వైకాపా నేతలు కలిశారు. ఎన్డీయేకే ఓటేస్తామంటూ వారు డబ్బులు తిరస్కరించారు. ఇది మనసులో పెట్టుకున్న వైకాపా కార్యకర్తలు పోలింగ్ ముగిసిననాడు రాత్రే ధనలక్ష్మి ఇంటి వద్దకొచ్చి హడావుడి చేస్తూ హెచ్చరించారు.
భుజాన వేసుకుని లాక్కెళ్లి...
బెదిరింపులను కొనసాగిస్తూనే వైకాపా మూకలు 15వ తేదీ రాత్రి మళ్లీ ధనలక్ష్మి ఇంటివద్దకొచ్చి గొడవ సృష్టించారు. వారిని ప్రశ్నిస్తూ ఇంటి బయటకు వచ్చిన ధనలక్ష్మి కుమారుడు మణికంఠను సినీ ఫక్కీలో నలుగురు భుజాన వేసుకుని పక్కకు లాక్కెళ్లి తలపై, ముఖంపై కర్రలతో దాడి చేశారు. ధనలక్ష్మితోపాటు ఆమె కుమార్తె నూకరత్నం తలపై ఇనుప చువ్వలతో బలంగా కొట్టారు. మరో కుమార్తె, గర్భిణి అయిన రమ్యను కాళ్లతో తన్నారు. దాడి చేసిన వారిలో భూలోక, భాస్కర్, లోకేశ్, సాయి, ఆశ, చిన్నితోపాటు మరో నలుగురున్నారని బాధితులు చెబుతున్నారు.
ఎఫ్ఐఆర్లో కుటుంబ వ్యవహారంగా...
తలపై గాయాలతో స్పృహ కోల్పోతున్నప్పుడు నూకరత్నం స్టేట్మెంట్ను పోలీసులు హడావుడిగా తీసుకున్నారని ధనలక్ష్మి ఆరోపిస్తున్నారు. కూటమికి ఓటేశారన్న కారణంతో దాడి జరగ్గా, ఎఫ్ఐఆర్లో మాత్రం కుటుంబ కలహాలంటూ నమోదు చేశారు. బాధితుల్లో ఒకరైన వివాహితురాలు నూకరత్నం ప్రస్తుతానికి తల్లి వద్దనే ఉంటున్నారని, ఆర్కిటెక్చర్ కోర్సు చదువుతున్న మణికంఠ ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారని, గర్భిణి రమ్య పుట్టింటికొచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 15వ తేదీ రాత్రి పదిన్నరకు ఇద్దరు నిందితులు ధనలక్ష్మి ఇంటి ముందు వెళుతూ దుర్భాషలాడటం, ప్రశ్నించడానికి వెళ్లిన ధనలక్ష్మి కుటుంబీకులపై లోకేశ్ మరికొందరు దాడి చేసినట్లు నమోదు చేశారు. దాడిలో రాజకీయ ప్రమేయం లేదని, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ఇప్పటికీ పేర్కొంటున్నారు.
గర్భిణిని అన్నా వదల్లేదు
దాడి సమయంలో గర్భిణిని అని చెప్పినా కనికరించకుండా కడుపుపై కాళ్లతో రెండు సార్లు తన్నారని బాధితురాలు రమ్య వాపోయారు. దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పానని వివరించారు. ఇనుపచువ్వలు చుట్టి ఉన్న కర్రను తీసుకొచ్చి తలపై గట్టిగా కొట్టడంతో రక్తం ధారగా కారిందని ధనలక్ష్మి వివరించారు. నలుగురు భుజాల మీద తనను ఎత్తుకెళ్లారని, ఇంటికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి ఇష్టానుసారం కొట్టారని మణికంఠ తెలిపారు. ‘బర్మా క్యాంపులో అంతా వైకాపావారే.. మీరు భాజపాకు ఓటేస్తారా?’ అంటూ రెండురోజుల ముందు కొందరొచ్చి గొడవపడ్డారని నూకరత్నం తెలిపారు. నొప్పులతో బాధ పడుతుంటే ఇష్టానుసారం స్టేట్మెంట్ రాసుకున్నారని, ఇంటి గొడవని చిత్రీకరించారని తెలిపారు.
వైకాపా గూండాలకు పోలీసు వ్యవస్థ మద్దతిస్తోందని విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్రాజు ఆరోపించారు. ఈ సంఘటన వైకాపావారు చేసిన పని అని తెలిస్తే ఎన్నికల సంఘం చర్యలు మెడకు చుట్టుకుంటాయని కేసును తారుమారు చేస్తున్నారని, దీన్ని సీపీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!