NRI Doctor Lokesh: ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఎత్తుకెళ్లి దాడి
గుండెనొప్పి అన్నా.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా జాప్యం
సీఎం విదేశీ పర్యటనకు కొద్ది సమయం ముందు ఘటన
జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించినందుకు కక్షసాధింపు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన తనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి దాడి చేశారని ఆయన వాపోయారు. వారు తన ఛాతీపై కొట్టడంతో గుండెల్లో నొప్పి వస్తోందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలినా.. వినిపించుకోకుండా తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించారన్నారు. విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఆదివారం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు విమాన టికెట్లు తీసుకున్నా. గన్నవరం నుంచి ఎయిరిండియా సర్వీసులో దిల్లీ వెళ్లేందుకు అవసరమైన టికెట్ ప్రింటింగ్ కోసం శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి వెళ్లా. రాత్రి 10 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కూర్చుని ఉండగా, కొందరు పోలీసులు వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. ఎక్కడికి తీసుకెళుతున్నారని అడిగితే.. విమానాశ్రయం గేటు బయట వదిలిపెడతామని చెప్పారు. నేనేం తప్పు చేశానని అడిగినా.. సమాధానం చెప్పలేదు. జాతీయ రహదారిపైకి వచ్చాక వాహనాన్ని ఎక్కడెక్కడో తిప్పి.. చివరికి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు’ అని లోకేశ్ వెల్లడించారు.
గుండెల్లో నొప్పి వస్తోందన్నా పట్టించుకోలేదు..
‘విమానాశ్రయం గేటు బయట విడిచి పెడతామని చెప్పి, ఎక్కడికి తీసుకెళుతున్నారని అడిగితే.. పోలీసులు నా ఛాతీపై గట్టిగా కొట్టారు. దీంతో బీపీ పెరిగిపోయి.. గుండెల్లో నొప్పి వస్తోందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అడిగా. కానీ, వాళ్లు నా మాట వినిపించుకోకుండా స్టేషన్లోనే కూర్చోబెట్టారు. నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో.. చివరికి గన్నవరంలోని ఓ చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు పరీక్షించి.. వెంటనే గుండె వైద్య నిపుణులున్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ పిలిపించాలని చెప్పినా పోలీసులు చాలా ఆలస్యం చేశారు. తర్వాత ఎప్పటికో అంబులెన్స్ తెచ్చి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి నుంచి వైద్యం అందడంతో శనివారానికి కొంత కోలుకున్నా’ అని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా తాను కొన్నేళ్లుగా ఎండగడుతున్నానని.. దీంతో రాష్ట్ర పోలీసులు తనపై నిఘా ఉంచి, విమానాశ్రయానికి వచ్చిన తనను బలవంతంగా ఎత్తుకెళ్లారని వాపోయారు.
ప్రవాసాంధ్రుడు డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
చిత్రంలో బసవయ్య, గూడపాటి లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, దారపనేని నరేంద్ర
హైకోర్టులో కేసు దాఖలు చేస్తా..
అమెరికా పౌరుడినైన తనను రాష్ట్ర పోలీసులు అపహరించడం చట్టవిరుద్ధమని డాక్టర్ లోకేశ్ పేర్కొన్నారు. ‘దీనిపై ఇప్పటికే అమెరికా ఎంబసీ, భారత ప్రధాని కార్యాలయానికి సమాచారం అందించా. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తదితరులకూ తెలియజేశా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ దీనిపై స్పందించి.. నాపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై హైకోర్టులో సోమవారం కేసు దాఖలు చేస్తా. డీజీపీ, సీఎస్లు స్పందించకపోతే వారిపైనా ప్రైవేటు కేసులు వేసి న్యాయపోరాటం చేస్తానని’ వెల్లడించారు. ఆయుష్ ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతున్న సమయంలోనూ పోలీసుల తీరు దారుణంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. అసలు తనను ఎందుకు నిర్బంధించారు, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో కూడా చెప్పకుండా.. దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. చివరికి తన తరఫు న్యాయవాది వచ్చి ప్రశ్నిస్తే.. అప్పుడు సెక్షన్ 151 కింద కేసు పెట్టినట్టు చెప్పి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారన్నారు. డాక్టర్ లోకేశ్ను తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, గూడపాటి లక్ష్మీనారాయణ, నరేంద్రలు పరామర్శించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని ఉమా తెలిపారు. పార్టీ తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని నేతలు ఆయనకు హామీ ఇచ్చారు.
41 నోటీసు ఇచ్చి.. ఇంటికి
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు యత్నించిన డాక్టర్ లోకేశ్పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న లోకేశ్ కొన్నాళ్లుగా తెదేపా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా, లోకేశ్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. ‘విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు వెళ్తున్నా.. మీరు కలిసి రావాలంటూ’ వివిధ వాట్సప్ గ్రూపుల్లో తెదేపా కార్యకర్తలను ఆయన ప్రేరేపించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి, ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు