Modi 3.0 Cabinet: కీలక శాఖలు భాజపాకే
కేంద్రంలో అత్యంత కీలకమైన నాలుగు శాఖలను భాజపా అట్టిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ (రక్షణ), అమిత్ షా (హోం), నిర్మలా సీతారామన్ (ఆర్థిక), జైశంకర్లకే (విదేశీ వ్యవహారాలు) అప్పగించింది.
రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జైశంకర్లకు పాతశాఖలే కేటాయింపు
మొత్తం 12 మందికి యథాతథం
నడ్డాకు వైద్య, ఆరోగ్యం
కిషన్రెడ్డికి బొగ్గు, గనులశాఖ
రామ్మోహన్నాయుడికి పౌర విమానయానం
సహాయ మంత్రులు..
పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖలు
శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలు
బండి సంజయ్కు హోం శాఖ
ఈనాడు - దిల్లీ
దిల్లీలో సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోదీ
కేంద్రంలో అత్యంత కీలకమైన నాలుగు శాఖలను భాజపా అట్టిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ (రక్షణ), అమిత్ షా (హోం), నిర్మలా సీతారామన్ (ఆర్థిక), జైశంకర్లకే (విదేశీ వ్యవహారాలు) అప్పగించింది. ప్రధాని నేతృత్వంలో భద్రతపై ఏర్పాటయ్యే క్యాబినెట్ కమిటీలో ఈ శాఖలు ఉండటమే దీనికి కారణం. వీరితోపాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రధాని సిఫార్సు మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన జి.కిషన్రెడ్డికి బొగ్గు, గనులశాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానశాఖ దక్కాయి. సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్కు హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖలను ప్రధాని కేటాయించారు.
- కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పని చేసినవారే. అందులో 12 మందికి పాతశాఖలే దక్కాయి. వీరిలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పురీ ఉన్నారు.
- అశ్వినీ వైష్ణవ్కు ఇదివరకు ఉన్న శాఖలకు తోడు కొత్తగా సమాచార, ప్రసారశాఖలను అప్పగించారు.
- హర్దీప్ సింగ్ పురీ నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖలను తొలగించారు.
- ఏడుగురు మంత్రులకు శాఖలు మారాయి. వారిలో ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, గజేంద్రసింగ్ శెఖావత్, కిషన్రెడ్డి, మన్సుఖ్ మాండవీయ, కిరణ్ రిజిజు ఉన్నారు.
- కేంద్ర క్యాబినెట్లోకి కొత్తగా వచ్చిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన గతంలో నిర్వర్తించిన వైద్య, ఆరోగ్యశాఖే కేటాయించారు.
- మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖలను అప్పగించారు. గతంలో ఈ శాఖలను అదే రాష్ట్రానికి చెందిన నరేంద్ర సింగ్ తోమర్ నిర్వర్తించారు.
- హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు కీలకమైన విద్యుత్తు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖలను కట్టబెట్టారు. ఇదివరకు ఈ శాఖలు ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పురీ దగ్గర ఉండేవి.
- జల్ శక్తిశాఖను గుజరాత్కు చెందిన సీఆర్ పాటిల్కు అప్పగించి ఇప్పటివరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన గజేంద్ర సింగ్ శెఖావత్కు పర్యాటకం, సాంస్కృతికశాఖలను అప్పగించారు.
- మాజీ ముఖ్యమంత్రులు హెచ్డీ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమలు, జీతన్రాం మాంఝీకి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను అప్పగించారు. సాధారణంగా మిత్రపక్షాలకు అప్పగించే ఈ శాఖలను ఇప్పుడూ అలాగే కేటాయించారు.
- జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్కు పంచాయతీరాజ్, పాడి, పశు సంవర్ధకశాఖలను ఇచ్చారు. ఇదివరకు ఈ బాధ్యతలను గుజరాత్కు చెందిన పురుషోత్తం రూపాలా నిర్వర్తించారు.
- స్మృతి ఇరానీ ఓడిపోవడంతో ఆ స్థానంలో ఇదివరకు విద్యాశాఖ సహాయ మంత్రిగా పని చేసిన అన్నపూర్ణా దేవిని కేబినెట్లోకి తీసుకుని మహిళా, శిశు సంక్షేమ బాధ్యతలను అప్పగించారు.
- చిరాగ్ పాస్వాన్కు ఇదివరకు ఆయన చిన్నాన్న పశుపతికుమార్ పారస్ నిర్వహించిన ఆహారశుద్ధి పరిశ్రమలశాఖనే కేటాయించారు.
ఇబ్బందులు రాకుండా..
ముఖ్యమైన శాఖలను భాజపా తనవద్దే ఉంచుకుంది. ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలులో ఇబ్బందులు ఎదురు కాకుండా, వాటిని వేగంగా కొనసాగించేందుకు వీలుగా సీనియర్ మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయలేదు. స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలను నిర్వహిస్తున్న ముగ్గురు పాత మంత్రుల శాఖలనూ యథాతథంగా కొనసాగించారు. పాత ప్రభుత్వమే కొనసాగుతోందన్న భావన కల్పించేలా మంత్రిత్వశాఖలను కేటాయించారు.
కిషన్రెడ్డికి ప్రమోషన్
- తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డిని పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల నుంచి తప్పించి కొత్తగా కీలకమైన బొగ్గు, గనులశాఖను అప్పగించారు.
- బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇదివరకు కిషన్రెడ్డి కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందడానికి ముందు హోంశాఖ సహాయమంత్రిగా పని చేశారు. కరీంనగర్ నుంచి భాజపా తరఫున గెలిచిన విద్యాసాగర్రావు కూడా హోంశాఖ సహాయమంత్రిగా సేవలందించారు.
రామ్మోహన్కు గతంలో తెదేపాకిచ్చిన శాఖే
ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానశాఖ దక్కింది. గతంలో 2014 నుంచి 18 వరకు ఇదే శాఖను విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఆయన హయాంలోనే కర్నూలు, దగదర్తి, భోగాపురం విమానాశ్రయాలకు బీజం పడింది. ఇందులో కర్నూలు పూర్తయింది. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పనులు జరిగాయి. ఆధునికీకరించిన తిరుపతి విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయ విస్తరణ, రాత్రిపూట విమానాల ల్యాండింగ్ సౌకర్య పనులు పూర్తయ్యాయి. హుద్హుద్తో దెబ్బతిన్న విశాఖ విమానాశ్రయ పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. కడప విమానాశ్రయం నుంచి ఆర్సీఎస్ ఉడాన్ కింద తక్కువ ధరల్లో విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు విజయవాడ విమానాశ్రయ విస్తరణ, భోగాపురం, దగదర్తిలలో నిర్మాణ బాధ్యతలను రామ్మోహన్నాయుడు చూడాల్సి ఉంటుంది.
- సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లశాఖలను అప్పగించారు. గ్రామీణ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పనులు ఈయన పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
- నర్సాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖలను కేటాయించారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యతలను ఆయన చూడాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం