CID Chief Sanjay: అధికారంలోకి కూటమి.. సెలవు పెట్టి అమెరికా వెళ్తున్న సీఐడీ బాస్‌ సంజయ్‌

తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలపై తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధికారి సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్‌ సెలవుపై వెళ్లనున్నారు.

Updated : 05 Jun 2024 07:12 IST

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలపై తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన అత్యంత వివాదాస్పద అధికారి సీఐడీ అడిషనల్‌ డీజీ సంజయ్‌ సెలవుపై వెళ్లనున్నారు. ఈ బుధవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెంటనే అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడం.. రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో ఆయన సెలవు పెట్టి విదేశాలకు వెళ్తుండడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు