CM Revanth Reddy: రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని.. వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కొనియాడారు.
నివాళి అర్పించిన సీఎం రేవంత్రెడ్డి
కుటుంబ సభ్యులకు పరామర్శ
రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళి అర్పిస్తున్న సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని.. వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కొనియాడారు. ఆయన మరణం ప్రజలకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పోరాడే విషయంలో రామోజీరావు.. తాను స్థాపించిన ‘ఈనాడు’, ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారని అన్నారు. సీఎం మంగళవారం ఫిల్మ్సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామోజీరావు తనయుడు, ‘ఈనాడు’ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, మనవడు సుజయ్, సహరి భర్త రేచస్లను పలకరించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సీఎంతో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి.. రామోజీకి నివాళి అర్పించారు. సీఎం మాట్లాడుతూ.. ‘రామోజీరావు చూపిన మార్గంలో ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతుంది. రామోజీ లాంటి మరో వ్యక్తి రారు. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన చూపిన మార్గంలో వారి సంస్థలు.. ప్రజల తరఫున నిలబడతాయని ఆకాంక్షిస్తున్నా. వారి కుటుంబానికి, సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా’ అని సీఎం భరోసా ఇచ్చారు.
రామోజీరావుకు నివాళి అర్పించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో బృహతి, రేచస్ ఎల్ల, సహరి,
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, దివిజ, సుజయ్, రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి
అందరికీ ఆదర్శప్రాయులు.. ఇంద్రసేనారెడ్డి
రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలుగు ప్రజలు అభిమానించే రామోజీరావు అందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. మంగళవారం ఆయన రామోజీ నివాసానికి వెళ్లి.. నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎందరికో స్ఫూర్తి: ఎమ్మెల్యే జి.వివేక్
రామోజీరావు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొనియాడారు. రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మీడియాకు విశ్వసనీయత తీసుకురావడంలో రామోజీ కీలకపాత్ర పోషించారన్నారు. సంక్లిష్ట సమయాల్లో ప్రజల పక్షాన తన గళాన్ని బలంగా వినిపించారన్నారు.
రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. చిత్రంలో శైలజా కిరణ్, కిరణ్, విజయేశ్వరి
అత్యున్నత స్థాయి జర్నలిజంలో ఓ శకం ముగిసింది.. కేఆర్ వేణుగోపాల్
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూయడంతో అత్యున్నత స్థాయి ప్రాంతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసినట్లయిందని ప్రధాన మంత్రి మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. రామోజీ జర్నలిజం ద్వారా జాతీయ ప్రాధాన్యమున్న ఎన్నో అంశాలను ప్రభావితం చేయగలిగారని తెలిపారు. 1982లో ‘ఈనాడు’ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటిచేత్తో విప్లవాత్మక మార్పునకు నాంది పలికారని వివరించారు. ఫలితంగానే ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ను.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ఓడించగలిగారన్నారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, జాతీయ స్థాయిలో తెదేపా చూపిన ప్రభావం వెనక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక దినపత్రికగా ‘ఈనాడు’ పాత్ర ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. రామోజీరావు కుటుంబానికి, ‘ఈనాడు’ పరివారానికి కేఆర్ వేణుగోపాల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్