Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

Published : 20 May 2024 04:03 IST

అన్నప్రసాదాల కోసం తోసుకుంటున్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆపై రింగ్‌రోడ్డు మీదుగా కల్యాణవేదిక వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. మూడు రోజులుగా రద్దీ భారీగా పెరగడంతో గదులు, అన్నప్రసాదాలు, ఇతర వసతుల కోసం భక్తులు అవస్థలు పడుతున్నారు. రద్దీ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే తెలిపింది. శనివారం శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.28 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

సీఆర్వో కేంద్రం వద్ద గదుల కోసం భక్తుల రద్దీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు