Polavaram: నమ్మించారు.. నిండా ముంచారు
గోదావరి వరదలకు 2021లో పోలవరం బ్యాక్వాటర్ రావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అతలాకుతలమైంది. ముంపు ప్రభావిత గ్రామాలతోపాటు దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు తదితర గ్రామాలవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారు.
ఇదీ పోలవరం నిర్వాసిత కుటుంబాల వేదన
పునరావాసం లేక.. ప్యాకేజీ రాక అవస్థలు
గోకవరంలో అసంపూర్తిగా పునరావాస కాలనీ
దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. అర్హత ఉండీ ప్రయోజనాలు అందనివారి వివరాలు సేకరిస్తాం. అధికారులనే గ్రామాలకు పంపించి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తాం. ఓటు హక్కు బదిలీ అయినంత మాత్రాన ప్యాకేజీ రాదనే ఆందోళన వద్దు.
ఫిబ్రవరి 29న గోకవరంలోని కృష్ణుడిపాలెం, దేవీపట్నం పునరావాస కాలనీల గ్రామసభల్లో రంపచోడవరం సబ్కలెక్టర్ ప్రశాంత్కుమార్
నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎవరు మోసం చేస్తున్నారో తెలియడం లేదు. కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు పంపించి ఏడిపిస్తున్నారు. అర్హులకు ప్యాకేజీ, పరిహారం ఇవ్వడం లేదు. నూటికి 90 మందికి తిండిలేక అవస్థలు పడుతున్నాం.
నిర్వాసితులకు న్యాయం కోసం ఇటీవల ప్రాణత్యాగానికి సిద్ధమైన రైతు సీతారామయ్య ఆవేదన
ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్టుడే, దేవీపట్నం: గోదావరి వరదలకు 2021లో పోలవరం బ్యాక్వాటర్ రావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అతలాకుతలమైంది. ముంపు ప్రభావిత గ్రామాలతోపాటు దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు తదితర గ్రామాలవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆ తరువాత వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని హామీల వర్షం కురిపించారు. మూడేళ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణుడిపాలెంలో 19 గ్రామాల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో కొందరికి ఇళ్లు కేటాయించారు. దేవీపట్నం, పూడిపల్లి ప్రజలకు మాత్రం ఇప్పటికీ గూడు కల్పించలేదు. దీంతో వారంతా గోకవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు. గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచాయి.
గోకవరంలో 75 ఎకరాల సేకరణ
దేవీపట్నం, పూడిపల్లి గ్రామాల ప్రజల పునరావాసానికి గోకవరంలో 75 ఎకరాలను సేకరించారు. దేవీపట్నం ప్రజల కోసం 55 ఎకరాలను ప్రత్యేకించారు. ఒక్కొక్కరికీ ఐదు సెంట్ల చొప్పున ఎకరాలో 12 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించి మిగిలిన భూమిని సామాజిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అందరికీ పట్టాలు అందజేశాక 530 ఇళ్లకు ప్రతిపాదించి 430 ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. పూడిపల్లి వాసుల కోసం 20 ఎకరాల్లో 74 ఇళ్లు మంజూరు చేశారు. 70 చివరి దశకు చేరుకున్నాయి. నాలుగు వివాదంలో ఉన్నాయి. దేవీపట్నం వాసులకు కేటాయించిన భూమిలో దాదాపు ఎనిమిదెకరాల విషయంలో న్యాయపరమైన వివాదాలు నెలకొనడంతో నిర్వాసితులకు పట్టాలిచ్చినా పనులు ప్రారంభించలేదు. రెండుచోట్లా కలిపి ఇప్పటివరకు మొత్తం 439 ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా సీసీ రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు కల్పించలేదు. కె.వీరవరంలోని 52 గిరిజన కుటుంబాలకు కంబలంపాలెం సమీపంలోని గుబ్బలంపాలెం పునరావాస కాలనీకి ఆనుకుని కొండ సమీపంలో పునరావాసం కల్పించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పునరావాస ప్యాకేజీ కోసం దేవీపట్నం మండలంలోని 44 గ్రామాల్లోనూ బాధితులున్నారు. తమకు ప్యాకేజీ పొందేందుకు అర్హత ఉందంటూ సుమారు 1,100 మంది దరఖాస్తు చేశారు. వారు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
న్యాయం చేస్తామని నమ్మకం కల్పిస్తారా?
ఓటర్ల ప్రమేయం లేకుండా రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి ఓట్లు ఎలా బదిలీ చేశారన్న స్థానికుల ప్రశ్నలపై స్పందించిన రంపచోడవరం సబ్కలెక్టర్ ప్రశాంత్కుమార్ ఫిబ్రవరి 29న కృష్ణుడిపాలెం, దేవీపట్నం పునరావాస కాలనీల్లో హడావుడిగా గ్రామసభలు నిర్వహించారు. వారంలో అధికారులను గ్రామానికి పంపించి పోలవరం నిర్వాసితులకూ న్యాయం చేస్తామని అన్నారు. ఓటు మారినంత మాత్రాన ప్యాకేజీ రాదనే భయం వద్దని భరోసానిచ్చారు. ‘ఇప్పటికి ఆరుగురు ఐఏఎస్ అధికారులు వచ్చి వెళ్లారు. ఇప్పుడు మీరూ సమస్యలన్నీ ఓపికగా విన్నారు. న్యాయం చేస్తారనే నమ్మకముంది’ అని మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆనాడు భరోసా ఇచ్చిన ఆయన ఆ తరువాత గ్రామాలకు సిబ్బందిని పంపలేదు. ప్యాకేజీలకు సంబంధించిన అర్హులనూ నిర్ధారించలేదు. దేవీపట్నం నివాసి, రైతు సీతారామయ్యకు అర్హత ఉన్నా ప్యాకేజీకి అనర్హుడంటూ ఇప్పటికీ వర్తింపజేయలేదు. అర్హత ఉండీ ప్యాకేజీలు, ఇళ్లు అందక, భూనిర్వాసితులకు నష్టపరిహారం దక్కక అనేక మంది ఇబ్బందులను గమనించి తన చావుతోనైనా అందరికీ న్యాయం జరుగుతుందని పురుగు మందుతాగి నిర్వాసిత రైతు సీతారామయ్య శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్దే ఆత్మహత్యాయత్నం చేశారు.
మూడేళ్లవుతున్నా పట్టించుకోలేదు
‘మేము నిర్మిస్తే ఆలస్యమవుతుంది. మీరే కట్టుకుంటే ఇంటి నిర్మాణానికి డబ్బులిస్తాం’ అని నాడు అధికారులు చెప్పి నమ్మించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతోపాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2.85 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి మూడేళ్లవుతున్నా డబ్బులందలేదు. ఇళ్లు లేక నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నాం.
దేవిశెట్టి వీరయ్యదొర, పూడిపల్లి
నిలువ నీడ లేకుండా చేశారు..
వరద భయంతో బయటకు వచ్చిన పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను ప్రభుత్వం రోడ్డున పడేసింది. కాలనీకి వచ్చిన ప్రతి అధికారి మీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మూడేళ్లుగా దేవీపట్నం నిర్వాసితులకు హామీలిస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇంటి నిర్మాణాలు మధ్యలోనే నిలిచాయి. కాలనీలు పూర్తవకుండానే ఇటీవల కురిసిన వర్షానికి దేవీపట్నం పునరావాస కాలనీ గోదావరిని తలపించింది.
కుంజం రాజామణి, సర్పంచి, దేవీపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం