Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం రద్దీ కొంతమేర తగ్గినా సాయంత్రానికి మళ్లీ పెరిగింది.

Published : 26 May 2024 05:17 IST

సర్వదర్శనానికి 30 గంటల సమయం

ఆళ్వార్‌ ట్యాంక్‌ సమీపంలోని సర్వదర్శనం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం రద్దీ కొంతమేర తగ్గినా సాయంత్రానికి మళ్లీ పెరిగింది. సమయ నిర్దేశిత సర్వదర్శనం (టైంస్లాట్‌) టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోందని తితిదే తెలిపింది. శుక్రవారం శ్రీవారిని 70,668 మంది భక్తులు దర్శించుకోగా రూ.3.64 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో తితిదే వీజీవో నందకిషోర్, ఏవీఎస్‌వోలు గిరిధర్, శివయ్య క్యూలైన్లను పరిశీలించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని