Election Commission: ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ, ఏపీఓ సస్పెన్షన్
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్ అధికారి (పీఓ), సహాయ పోలింగ్ అధికారి (ఏపీఓ)లను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ ఈసీ సీరియస్
ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్ అధికారి (పీఓ), సహాయ పోలింగ్ అధికారి (ఏపీఓ)లను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడక ముందు.. గురువారం మధ్యాహ్నం మీనా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలు సహా ఎనిమిది బృందాల పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. ఈవీఎం ధ్వంసం విషయంలో ఎన్నికల సంఘం సీరియస్గా ఉందని, త్వరలోనే ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన దృశ్యాలు ఎన్నికల సంఘం నుంచి బయటకు వెళ్లలేదన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి బయటి నుంచి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు తెదేపా నాయకులు ఇప్పుడు వెళ్లడం సరికాదన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని.. తెదేపా నేతలు వెళితే వైకాపా నేతలు కూడా పరామర్శలకు వెళ్తామని అంటారని చెప్పారు. పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉన్నందున పరామర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు ఏయే ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో జూన్ 4న ఓట్ల లెక్కింపును కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలన్నారు. ఏ రోజున ఎన్ని గంటలకు ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారో ఆ వివరాలు రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్రూమ్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు వేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లు లెక్కించాలని మీనా జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశారు. ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని నియమించుకుని వారికి ముందుగా శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ఠమైన మూడంచెల భద్రత కొనసాగుతోందని సీఈఓ చెప్పారు. స్ట్రాంగ్రూమ్లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత, పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మీనా సూచించారు. సమావేశంలో అదనపు సీఈఓలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్.హరిందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈసీ ఆదేశాల మేరకు చర్యలు
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ రోజు సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కళాశాల అధ్యాపకుడు పీవీ సుబ్బారావు పీఓగా, వెంకటపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని షేక్ షహనాజ్ బేగం ఏపీఓగా వ్యవహరించారు. ఈ కేంద్రంలోని ఈవీఎంను వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు ఎన్నికల నియమావళిని ఉల్లఘించినందున.. ఈసీ ఆదేశాలమేరకు పీఓ, ఏపీఓలను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బాలాజీరావు గురువారం ఉత్తర్వులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM