Jawahar Reddy: ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే..
ఆయన పైనే ఆరోపణలు.. ఆయన్నుంచే కీలక నివేదికలు
సూచించిన వారికి పోస్టింగ్లు.. చెప్పిన వారిపై సస్పెన్షన్లు
పూర్తిగా సీఎస్పైనే ఆధారపడుతున్న ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. ఫలానా అధికారులు తప్పు చేశారని నివేదిక పంపిందీ ఆయనే..! వారి స్థానంలో ఎవర్ని నియమించాలో సూచించిందీ ఆయనే..! పోలింగ్ సందర్భంగా హింసాకాండ చెలరేగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోనిదీ ఆయనే..! తీరా హింసాత్మక ఘటనలు జరిగాక.. దానికి ముగ్గురు ఎస్పీల్ని, ఒక కలెక్టర్ను బాధ్యుల్ని చేస్తూ.. వారిపై చర్యలకు సిఫారసు చేసిందీ ఆయనే..! అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అన్ని వివాదాలకూ కేంద్ర బిందువుగా నిలిచిందీ ఆయనే..! ఇంతకీ ఆ అధికారి ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డే!
సీఎస్ తీరు అలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఇంకా విచిత్రంగా ఉంది. అధికార పార్టీకి సీఎస్ కొమ్ము కాస్తున్నారని.. ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు చేసేలా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన్ను మార్చాలని విపక్షాలు నెత్తీనోరూ కొట్టుకున్నా, అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ పట్టించుకోలేదు. సీఎస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా, అవి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేలా ఉంటున్నా.. ఈసీ చూసీచూడనట్టే ఉంది. ఇలా ప్రతి విషయానికీ సీఎస్పైనే ఈసీ ఆధారపడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈసీ పరిధిలో సీఎస్ పని చేస్తున్నారా? సీఎస్ నియంత్రణలో ఈసీ పని చేస్తోందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా.. ఏకపక్షంగా, ఒక పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించినా, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది.
వివాదాస్పద అధికారిపై ఎలా ఆధారపడతారు?
సీఎస్పై ఎన్ని విమర్శలు వచ్చినా ఈసీ పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని వెలువరించిన నిర్ణయంతో 32 మంది బలైపోయినా సీఎస్పై చర్యల్లేవు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా మే నెల పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఒక సూచన చేసిందే తప్ప, ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. వివాదాస్పద అధికారులపై చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో.. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఎన్నికల కోడ్కి అనుగుణంగా ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి సీఎస్ పంపిన నివేదికపైనే పూర్తిగా ఆధారపడింది. సీఎస్పై అన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న సిఫారసులు హేతుబద్ధంగా ఉంటున్నాయా.. ఒక పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయా.. స్క్రీనింగ్ కమిటీల ఆమోదంతో ఈసీ అనుమతి కోసం పంపిస్తున్న అంశాల్లో మతలబు ఉందన్న విషయాల్ని ఈసీ తరచి చూడలేదన్న విమర్శలున్నాయి. సీఎస్పైనే అన్ని ఆరోపణలున్నప్పుడు.. వివాదాస్పద అధికారులుగా ముద్రపడటంతో తొలగించిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల స్థానంలో ఎవర్ని నియమించాలన్న దానిపై ఆయన్నుంచే నివేదిక రప్పించుకోవడమేంటి? ఆయన పంపిన జాబితాలోని అధికారుల్నే నియమించడమేంటి? పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై నివేదిక పంపాలని సీఎస్నే అడగడమేంటి? ఇద్దరు ఎస్పీల్ని సస్పెండ్ చేయాలని, ఒక కలెక్టర్, మరో ఎస్పీని బదిలీ చేయాలని సీఎస్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఈసీ చర్యలు తీసుకోవడమేంటి? పెద్దఎత్తున హింసాకాండ చెలరేగినా సీఎస్ను బాధ్యుడిని చేయకపోవడమేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అధికార పార్టీకి వీర విధేయత
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన జవహర్రెడ్డి.. వైకాపాకు వీర విధేయత ప్రదర్శిస్తూ, ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న అప్రదిష్ట మూటగట్టుకున్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాల్సిన సీఎస్ ఆ బాధ్యతను విస్మరించి.. కొన్నిచోట్ల తీవ్ర హింసాకాండ చెలరేగేసరికి.. తనకేమీ సంబంధం లేదన్నట్టు ఆ నెపాన్ని అక్కడి ఎస్పీలు, కలెక్టర్పై నెట్టేసి వారిని బలి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. సీఎస్పై విపక్షాలు ఈసీకి అనేక ఫిర్యాదులు చేశాయి. సీఎం జగన్కు జవహర్రెడ్డి నమ్మిన బంటని, ఆయన సీఎస్గా ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా అనేకమంది ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
అన్నీ వివాదాస్పద నిర్ణయాలే..!
- వివాదాస్పద అధికారులుగా పేరుపొందిన మూడు జిల్లాల కలెక్టర్లు, ఆరు జిల్లాల ఎస్పీల్ని ఏప్రిల్ మొదటి వారంలో ఈసీ బదిలీ చేసింది. వారి స్థానంలో నియమించేందుకు సీఎస్ కొందరు అధికారుల జాబితాలను ఈసీకి పంపించారు. వారిలో మళ్లీ కొందరు వివాదాస్పద అధికారులే ఉండడం గమనార్హం.
- వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశిస్తే.. ఏప్రిల్లో ఇంటింటికీ పింఛను పంపిణీని నిలిపేసి, అందరూ గ్రామ/వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్పారు. ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసి... వైకాపాకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసమే సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలున్నాయి. మే నెల వచ్చేసరికి.. ఏకంగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోమని ఆదేశించారు. దీంతో వృద్ధులు అనేక అవస్ధలు పడ్డారు.
- రైతులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేయకుండా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన గుత్తేదారులకు దాదాపు రూ.13 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించడంలో సీఎస్ కీలక పాత్ర నిర్వహించారని, ముందు వచ్చినవారికి ముందు చెల్లింపు (ఫిఫో) విధానాన్ని పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి.
- జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి, సరిగ్గా పోలింగ్ తేదీకి నాలుగైదు రోజుల ముందు రూ.14,165 కోట్ల నిధుల్ని వారి ఖాతాల్లో వేసి, అధికార పార్టీకి అనుకూలంగా వారిని ప్రభావితం చేసేందుకు వ్యూహం పన్నారు. దిల్లీ నుంచి ఈసీ అధికారులు తీవ్రస్థాయిలో తలంటడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తీరా పోలింగ్ ప్రక్రియ ముగిశాక ఆ మొత్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేశారా? అంటే అదీ లేదు. ఇప్పుడు ఆ నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో విడతలుగా వేస్తూ, మిగతా నిధుల్ని అస్మదీయ గుత్తేదారులకు సర్దుబాటు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
- డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) పది రోజుల క్రితం ఆదేశించినా... సీఎస్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్