Andhra Pradesh Assembly Elections: ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది.
ఇది ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్ష కాదా?
తెల్లవారుజాము వరకూ పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు?
పోలింగ్ బూత్ల ఏర్పాటులో అశాస్త్రీయత
5,600 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో చోట 1,200 మందికి పైగా ఓటర్లు
ప్రతి ఎన్నికలోనూ ఇవే కష్టాలు ఎదురవుతున్నా పాఠాలు నేర్వని ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. అసలే మండుటెండలు, ఆపై తీవ్రమైన ఉక్కపోత, గొంతెండిపోతున్నా సరే అందుబాటులో తాగునీరు లభించని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందుల మధ్య ఒక్కొక్కరు నాలుగు నుంచి ఆరున్నర గంటల పాటు క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తే ఏ ఓటరైనా ఆహ్లాదంగా ఓటు వేయగలరా?
‘ఓటు హక్కు వినియోగించుకోండి.. బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలవండి’ అంటూ ప్రకటనలతో ఊదరగొట్టే ఎన్నికల సంఘం... 5,600 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో చోట 1,200కు పైగా ఓటర్లను కేటాయించింది. కొన్ని చోట్ల 1300, 1400 మందికి పైగానూ ఓటర్లు ఉన్నారు. పోలింగ్కు నిర్దేశించిన సమయమెంత? ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యికి పైగా ఓటర్లు ఉంటే వారు ఇబ్బంది పడకుండా ఓట్లు వేయడం సాధ్యమవుతుందా? 400-500 మంది ఓటర్లకు ఒక బూత్ను ఏర్పాటు చేయలేమా? వంటి ప్రశ్నలు సగటు ఓటరు నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఎన్నికలోనూ ఓటర్లకు ఇవే కష్టాలు పునరావృతమవుతున్నా ఎన్నికల సంఘం పాఠాలు నేర్వడం లేదు.
ఇది ఎన్నికల సంఘం మాట: ఒక వ్యక్తి లోక్సభ, శాసనసభకు సంబంధించి రెండు ఓట్లు వేయడానికి సగటున 27 నుంచి 30 సెకన్ల సమయం పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గంటకు సగటున 120 మంది వరకూ ఓటు వేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఒక్కో ఈవీఎం గంటకు 120కు పైగా ఓట్లును తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుందనేది వారి మాట. కానీ ఆచరణలో అది సాధ్యం కాదు.
ఒక్కో వ్యక్తి ఓటు వేయటానికి తక్కువలో తక్కువగా కనీసం రెండు నిమిషాల సమయం పడుతోంది. లోక్సభ, శాసనసభకు ఒకే సారి ఎన్నిక జరిగినందున ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేయాలి.
ఉదయం 7 గంటల నుంచి నుంచి సాయంత్రం 6 వరకూ మొత్తంగా 11 గంటల పాటు ఎన్నికల సంఘం పోలింగ్కు సమయమిస్తోంది.. ఈ 11 గంటల వ్యవధిలో 1000-1200 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం. ఇక ఈవీఎంల మొరాయింపు, ఇతర సాంకేతిక సమస్యలు ఏవైనా తలెత్తితే ఇంకా జాప్యం జరిగి మరింతగా ఇబ్బందులొస్తాయి. కానీ ఇవేవి పరిగణనలోకి తీసుకోని ఎన్నికల సంఘం మాత్రం చాలా చోట్ల ఒక్కో పోలింగ్ కేంద్రంలో అధికంగా ఓటర్లను చేర్చింది. ఇదే ఓటర్లకు నరకయాతనగా మారింది.
ఓటు వేసేందుకు ఆరున్నర గంటల నిరీక్షణ
ఉదాహరణకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని 205వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,369 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవటానికి దాదాపు ఆరు గంటల పాటు క్యూలైన్లో నిలుచోవాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గంలోని గుడ్న్యూస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలోని 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,467 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఒక్కో ఓటరు నాలుగున్నర గంటల పాటు క్యూలైన్లో నిలబడాల్సి వచ్చింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 254వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1,087 ఓట్లున్నాయి. ఇక్కడ ఒక్కో ఓటరు మూడు గంటల పాటు క్యూలైన్లో నిరీక్షించాల్సి వచ్చింది.
ఒక వైపు మండుటెండ, మరోవైపు నీళ్లు తాగుదామంటే క్యూలైన్ల పక్కన ఉండవు. దూరంగా ఎక్కడో పెట్టారు. అక్కడికి వెళ్లి తాగుదామంటే ఈ క్యూలైన్లో తన క్రమం తప్పిపోతే మళ్లీ మొదటి నుంచి నిలుచోవాల్సి వస్తుందనే ఆందోళన. బీపీ, షుగర్ పేషెంట్లు అన్ని గంటల పాటు క్యూలైన్లో నిలుచోలేక పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలా చోట్ల ఇరుకుగా ఉండే ఒకే భవన సముదాయం ప్రాంగణంలోని ఒక్కో గదిని ఒక్కో పోలింగ్ కేంద్రంగా మార్చేశారు. ఆ క్యూలైన్లు, ఈ క్యూలైన్లు కలిసిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం వృద్ధులు కూర్చోటానికి చైర్లు కూడా లేని పరిస్థితి.
అర్ధరాత్రి, తెల్లవారుజాము పోలింగా?
సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిన పోలింగ్ను అర్ధరాత్రి దాటేంతవరకూ, మరుసటి రోజు తెల్లవారు జామువరకూ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? అంటే ఒక పోలింగ్ కేంద్రంలో నిర్దేశిత సమయంలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోగలరో అంతకు మూడు, నాలుగు రెట్లు అధికంగా ఓటర్లను చేర్చటం వల్లే ఈ పరిస్థితి. వందశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. సుమారు 81 శాతం పోలింగ్ జరిగితేనే అర్ధరాత్రి వరకూ, మరుసటి రోజు ఉదయం వరకూ పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటే.. ఇక వారి వంద శాతం పోలింగ్ జరిగితే ఎన్నిక ప్రక్రియ పూర్తవ్వాలంటే ఎంత సమయం పడుతుందో?
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500కు మించితే ఇబ్బందే
- సగటున ప్రతి 400-500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగితే ఓటర్లకు ఇబ్బందులు తప్పుతాయి. వారు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోగలరు. ఇబ్బందులు తప్పుతాయి. అర్ధరాత్రి వరకూ, మరుసటి రోజూ వరకూ పోలింగ్ కొనసాగించాల్సిన అవసరమూ తలెత్తదు.
- రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలకు కొరతే లేదు. ఊరూరా అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల భవనాలు, సామాజిక భవనాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. విధులు నిర్వర్తించేందుకూ కావాల్సినంత మంది ప్రభుత్వోద్యోగులు సిద్ధంగానే ఉన్నారు. ఆ మేరకు అవసరమైన ఈవీఎంలు సమకూర్చుకుంటే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే