AP News: బొత్సకు డబ్బులిచ్చాం.. అయినా బదిలీ కాలేదు!
ఎన్నికల ముందు రూ.కోట్లు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు
ఎన్నికల ముందు బదిలీల పేరిట రూ.50 కోట్లు వసూలు చేసిన మంత్రి బొత్స, ఆయన పేషీ అధికారులు
సిఫార్సు బదిలీలు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపివేత
విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి..
ఈనాడు - అమరావతి
ఎన్నికల ముందు రూ.కోట్లు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని మంత్రి, ఆయన పేషీలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావుడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలొచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్ అయి, కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలిచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో కోడ్ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ గురువారంతో ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
డబ్బులు పోయే.. బదిలీ ఆగిపోయే!
రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వివిధ కారణాలతో పట్టణాలు, నగరాలకు సమీపంలోకి వచ్చేందుకు ఈ బదిలీలను ఆశ్రయించారు. మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు కలిసి దాదాపు రూ.50 కోట్లు ఈ బదిలీల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో డబ్బులూ పోయాయి.. బదిలీలు ఆగిపోయాయని బాధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం డబ్బులు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో 1,400 మందికి మాత్రమే బదిలీలు చేశారు. వీరిలోనూ కొందరికి పోస్టులు లేకుండా పోయాయి. డబ్బులు ఇచ్చినా బదిలీలు కాని కొందరు ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడలో ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు బాధిత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రకటన విడుదల చేశారు.
రెండు శాఖలను కలిపి కూర్చోబెట్టి..
సిఫార్సు బదిలీలను హడావుడిగా పూర్తి చేసేందుకు ఒక కీలక అధికారి ఏకంగా కమిషనరేట్లో పని చేసే అధికారులు, సిబ్బందిని, సచివాలయంలో పని చేసే అధికారులను ఒకేచోట కూర్చోబెట్టారు. కమిషనరేట్ నుంచి సచివాలయానికి దస్త్రాలు, జాబితాలు వెళ్లి, మళ్లీ తిరిగి రావడం, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడంలాంటివి ఆలస్యమవుతున్నాయంటూ అందర్నీ ఒకేచోట కూర్చోబెట్టి ఈ సిఫార్సు బదిలీలను చేయించారు. మొదట్లో బదిలీ చేసిన కొంతమందికి జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఏప్రిల్ 23న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ బదిలీలను ర్యాటిఫై చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన కీలక అధికారి.. రెండు విభాగాలకు చెందిన అధికారులను ఒకేచోట కూర్చోబెట్టి బదిలీలు చేయించడం అవినీతికి పరాకాష్ఠ. ఇంతా చేస్తే ఈ బదిలీలకు అడ్డుకట్ట పడింది. మంత్రి, ఆయన పీఏ, కొందరు అధికారులు, వైకాపా నేతలు ఈ బదిలీలతో భారీగా లబ్ధి పొందగా.. డబ్బులిచ్చిన ఉపాధ్యాయులు బాధితులుగా మిగిలారు. డబ్బులు పోయాయి.. బదిలీలూ కాలేదని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినా బదిలీ పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇలాంటివారు వందల్లో ఉన్నారు. వీరు తమ డబ్బులు వెనక్కి ఇప్పించాలని కోరుతున్నారు.
ఒక్కోసారి ఒక్కో విధానంతో దందా
బదిలీలకు ప్రతిసారీ కొత్త విధానాన్ని తీసుకురావడం మంత్రి, ఆయన పేషీకి తెలిసినట్లు మరెవరికీ తెలియకపోవచ్చు. ఒక్కోసారి ఒక్కో విధానం అంటూ భారీగా డబ్బు గుంజేశారు. సాధారణ బదిలీలు గతేడాది జూన్తో ముగిశాయి. జులైలో అనధికారికంగా కొన్ని సిఫార్సు బదిలీలు చేశారు. వీటికీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయినా దాహం తీరని ప్రజాప్రతినిధి మరో విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి ఉపాధ్యాయినులకే బదిలీలంటూ సిఫార్సులకు అనుమతించారు. ఈ సమయంలోనూ మరోసారి డబ్బులు నొక్కేశారు. ఈ సమయంలో 600 వరకు బదిలీలు చేశారు. టీచర్ల బదిలీల్లో ప్రాంతాలు, హెచ్ఆర్ఏ ఆధారంగా అన్ని స్థాయిల్లో కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. బదిలీ కావాలంటే ముందుగా వైకాపా నాయకుడు, ప్రజాప్రతినిధి నుంచి లేఖ కావాలనే అనధికారిక నిబంధన పెట్టారు. కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖ ఇచ్చేందుకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజేశారు. బదిలీ దరఖాస్తులతోపాటు వైకాపా నేతల లేఖలు ఇచ్చాక.. మంత్రి వద్ద పని చేసే పీఏ నేరుగా మామూళ్లు వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పీఏ సిఫార్సు చేసిన జాబితాకే ఉన్నతాధికారి ఆమోదముద్ర వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్