Vidya kanuka: విద్యాకానుకలో రూ.150 కోట్ల దోపిడీ
వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి సామగ్రి సరఫరా లేకుండానే నిధులు మింగేశారు. ఉత్తరాంధ్రకు చెందిన అప్పటి కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు భారీగా ప్రజాధనానికి గండికొట్టినట్లు ఆరోపణలున్నాయి.
టెండర్లు లేకుండానే రూ.772 కోట్ల సామగ్రి సరఫరా బాధ్యతలు
న్యాయ సమీక్ష నుంచి తప్పించుకునేందుకు టెండర్ల విభజన
విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా 9.31 లక్షల కిట్లు కొనుగోలు
నాలుగేళ్లుగా మాయ చేసిన వైకాపా ప్రభుత్వం
బ్యాగులు చినిగిపోయినా చర్యల్లేవు
దీనికోసం 5% కమీషన్ దండుకున్న ఉత్తరాంధ్రలోని వైకాపా కీలక మంత్రి
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపి సామగ్రి సరఫరా లేకుండానే నిధులు మింగేశారు. ఉత్తరాంధ్రకు చెందిన అప్పటి కీలక మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు భారీగా ప్రజాధనానికి గండికొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది విద్యాకానుకకు ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదార్లకు సరఫరా బాధ్యతలు అప్పగించి, ముందుగానే డబ్బులు దండుకున్నట్లు విమర్శలున్నాయి. వైకాపా ప్రభుత్వంలో మంత్రి కీలకంగా ఉండడంతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. నాణ్యతలేని బ్యాగ్లు సరఫరా చేసినా గుత్తేదార్లపై గానీ, అధికారులపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ బ్యాగ్లను సరఫరా చేసిన గుత్తేదార్లకు టెండర్లు లేకుండానే అప్పగించేశారు. ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ జరిపితే భారీగా అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
కమీషన్ల కోసం టెండర్లు లేకుండానే..
విద్యార్థులకు ఈ ఏడాది అందించే విద్యా కానుక సామగ్రికి టెండర్లు నిర్వహించకుండానే పాత గుత్తేదార్లకు రూ.772 కోట్ల విలువ చేసే కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కమీషన్ల కోసం పాతవారికే ఇచ్చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు ఉంటాయని ముందే తెలుసు.. దీనికి అనుగుణంగా టెండర్లు నిర్వహించాలి. కానీ, ఉత్తరాంధ్ర మంత్రి, ఉన్నతాధికారి కలిసి పాత గుత్తేదార్లకు ఎలాంటి టెండర్లు లేకుండా ఇచ్చేశారు. పాఠశాలల్లో 36.54 లక్షల మంది విద్యార్థులు ఉంటే 39.51 లక్షల కిట్లకు ఆర్డర్లు ఇచ్చారు.
- మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. ధరలు పెరిగితే పాత ధరకు, ధరలు తగ్గితే తగ్గిన ధరకే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ సమగ్ర శిక్షా అభియాన్ పట్టించుకోలేదు. పాత ధరల చొప్పున ఇచ్చేశారు.
- మార్కెట్లో కాగితం ధర తగ్గినా ఒక్కో నోట్పుస్తకం రూ.52 చొప్పున పాత ధరకే ఇచ్చేశారు. గతేడాది ఇద్దరు గుత్తేదార్లు నోట్ పుస్తకాలను సరఫరా చేశారు. వీరిలో ఒకరు రాయలసీమకు చెందిన వైకాపా సానుభూతిపరుడు. ఈ ఏడాది ఆయనొక్కరికే మొత్తం కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిపై ఇచ్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఎన్నికల ముందు కీలక ప్రజాప్రతినిధికి రూ.6 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. నోట్పుస్తకాల కాగితం నాణ్యత లేకపోవడంతో ఒక గుత్తేదారును తప్పించినట్లు అధికారులు చెబుతున్నా తెర వెనుక చాలా తతంగం నడిచిందని విమర్శలున్నాయి.
- నోట్పుస్తకాల్లో కాగితం నాణ్యత లేదని గుత్తేదారును తప్పించిన అధికారులు బ్యాగ్ల విషయంలో దీన్ని పాటించలేదు. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు సరఫరా చేసిన బ్యాగ్లు రెండు, మూడు నెలల్లోనే చినిగిపోయాయి. అయినా ఆ గుత్తేదారుకే ఈ ఏడాది బ్యాగ్ల సరఫరా కాంట్రాక్టు అప్పగించారు.
- వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయిందని రాష్ట్ర అడిట్ విభాగం సైతం 2023లో నిగ్గుతేల్చింది. రూ.100 కోట్లు దాటిన ఏ టెండరునైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలన్నది నిబంధన. విద్యాకానుక టెండర్లను జోన్ల వారీగా విభజించి జ్యుడిషియల్ ప్రివ్యూ లేకుండా చేశారు.
విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినా..
విద్యాకానుక-3లో భాగంగా సరఫరా చేసిన బ్యాగ్లు ఇచ్చిన మూడు నెలలకే చినిగిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం 47 లక్షల బ్యాగ్లు సరఫరా చేశారు. అందరి బ్యాగ్లు చినిగిపోయినా కేవలం 6 లక్షలు మార్పు చేసినట్లు చూపి.. గుత్తేదార్లు, అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా చేశారు. గుత్తేదార్ల నుంచి 5% కమీషన్ పిండుకున్న ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా మంత్రి ఈ విషయంలో చక్రం తిప్పారు. బ్యాగ్ల పరిమాణం, నాణ్యతకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ను మార్చేశారు. గుత్తేదారు నమూనాగా ఇచ్చిన బ్యాగ్లనూ మాయం చేశారు. బ్యాగ్ల నాణ్యతను నిర్ధారించిన సీపెట్ అధికారి ఒకరి హస్తం ఇందులో ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్లు చినిగిపోతే విచారణకు ఆదేశించకుండా ఉత్తరాంధ్ర మంత్రి, కొందరు అధికారులు మరింత ఎక్కువ కమీషన్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో నమూనాగా విజిలెన్స్ చేసిన తనిఖీల్లోనూ బ్యాగ్లు చినిగిపోయినట్లు బయటపడింది. కానీ వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ గుత్తేదారులే కంపెనీల పేర్లు మార్చి, మళ్లీ బ్యాగ్లు సరఫరా చేస్తుండటం గమనార్హం.
ఈ దోపిడీకి సమాధానమేదీ?
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా విద్యాకానుక కిట్లు కొన్నట్లు లెక్కలు చూపి భారీగా ప్రజాధనానికి గండికొట్టారు. ఒక ఏడాది కిట్లు మిగిలితే వాటిని ఆ తర్వాత సంవత్సరం వినియోగించకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా కొంటూనే వచ్చారు. మూడేళ్లలో 9,31,166 లక్షల కిట్లు అదనంగా కొనుగోలు చేశారు. ఒక్కో కిట్టుకు సరాసరిన రూ.1600 చొప్పున లెక్కించినా రూ.149 కోట్ల అవినీతి చోటుచేసుకుంది. ఇక మార్కెట్ ధరలు, టెండర్లలో నిర్ణయించిన ధరలను పోల్చి చూస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుంది.
- 2021 అక్టోబరులో ప్రభుత్వ పాఠశాలల్లో 45.60 లక్షల మంది విద్యార్థులున్నట్లు లెక్కలు చూపారు. ఈ సంఖ్యపై 5% పెరుగుదలతో 2022-23 సంవత్సరానికి 47.88 లక్షల కిట్లు కొనేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. 45.14 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో కిట్టుకు రూ.1,565 చొప్పున ధర ఖరారు చేస్తూ రూ.960.48 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య 40.66 లక్షలకు పడిపోవడంతో నాలుగు లక్షలకు పైగా కిట్లు మిగిలిపోయాయి. వీటిని ఆ తర్వాత సంవత్సరం సైతం వినియోగించలేదు. వీటి విలువ రూ.70.13 కోట్లు.
- 2023-24 విద్యా సంవత్సరానికి కొత్త టెండర్లు పిలిచేటప్పుడు అంతకు ముందు ఏడాదిలో మిగిలిపోయిన నాలుగు లక్షల కిట్ల విషయాన్ని పట్టించుకోలేదు. ఈసారి కూడా విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా మరోసారి అంచనాలకు మించి 43.10 లక్షల కిట్లకు టెండర్లు పిలిచారు. సరఫరా 39.98 లక్షలే తీసుకున్నామని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సందర్భంగా విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ప్రభుత్వ బడుల్లో 36,54,539 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 3.43 లక్షల కిట్లు మిగలాలి. వీటికీ ఇంతవరకు లెక్కల్లేవు. 2022-23, 2023-24 రెండేళ్లలోనే 7 లక్షలకు పైగా కిట్లు మిగలాలి. గుత్తేదార్ల నుంచి సామగ్రి తీసుకోకుండానే కమీషన్ల కోసం అదనంగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ