Palnadu: పల్నాడు.. వర్గపోరుతో వల్లకాడు.. దశాబ్దాలుగా కోలుకోని కుటుంబాలు
గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం.. రాజకీయ నేతల స్వార్థం.. పల్నాడు పల్లెల్లో దశాబ్దాల కింద రగిల్చిన చిచ్చులో ఎన్నో కుటుంబాలు సమిధలైపోయాయి.
పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు
తాజా ఘర్షణలతో నాటి నెత్తుటి గాథలు గుర్తుచేసుకుంటున్న బాధితులు
ఈనాడు- నరసరావుపేట, న్యూస్టుడే- కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి: గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం.. రాజకీయ నేతల స్వార్థం.. పల్నాడు పల్లెల్లో దశాబ్దాల కింద రగిల్చిన చిచ్చులో ఎన్నో కుటుంబాలు సమిధలైపోయాయి. గ్రామాల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి జరిగిన గొడవల్లో పెద్దదిక్కును కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయిన మహిళలు.. తండ్రి లేక తల్లి పడే కష్టంలో పాలుపంచుకుంటూ చదువుకు దూరమైన పిల్లలు పడిన అవస్థలు వర్ణనాతీతం. వర్గాలను కాపాడుకోవడానికి.. కేసులు నమోదైతే బెయిల్, రిమాండ్ ఖర్చులకు భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. తన వర్గాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి వెచ్చించే ఖర్చుతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వారసులకు అప్పులు మిగిలాయి. భర్త హత్యకు గురైతే పిల్లలను చూసుకుంటూ పొలాలను సాగు చేసి భారంగా బతుకు లాగిన భార్యల కథలు ఈ గడ్డపై కోకొల్లలు. హత్య కేసుల్లో భర్త జైలుకెళితే కుటుంబపోషణకు, న్యాయస్థానాల ఖర్చులకు భూములు తెగనమ్మి కూలీ పనులకు వెళుతూ అష్టకష్టాలు పడుతున్న అతివల దయనీయ గాథలూ ఎన్నో. హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ప్రత్యర్థులు ఎప్పుడు మీద పడి తెగనరుకుతారోనన్న ఆందోళనతో గ్రామాలు వదిలి ఏళ్లతరబడి పొరుగూళ్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. ఇలా వర్గపోరు పల్నాడును వల్లకాడులా మార్చింది. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల రూపంలో మరోసారి పల్నాడులో ఘర్షణలు చెలరేగి సుమారు వెయ్యి మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పల్నాడులో ఫ్యాక్షన్కు బలైపోయిన కుటుంబాలు నాటి ఘటనలను గుర్తుచేసుకుంటున్నారు.
ఏడాదిన్నరలో ఏడు హత్యలు
- బీరవల్లి రామిరెడ్డి, పట్లవీడు గ్రామం, వెల్దుర్తి మండలం
మూడు దశాబ్దాల కిందట పట్లవీడు గ్రామంలో మా పొలంలో మరో సామాజికవర్గం వారి పశువులు వచ్చి మేశాయని వివాదం మొదలైంది. ఈ వివాదం పెద్దదై పొలంలో కూలీలతో పని చేయిస్తున్న మా నాన్నను ప్రత్యర్థులు చంపేశారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని అక్కడే హతమార్చారు. అంతటితో ఆగకుండా గ్రామంలోకి వచ్చి మా వర్గంలో మరొకర్ని హత్య చేశారు. ఈ గొడవల్ని నియంత్రించే క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఒక రోజు వ్యవధిలోనే నలుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు మా తమ్ముడు కనిపించకుండా పోయాడు. ఇది ప్రత్యర్థుల పనేనని గుర్తించినా మిన్నకుండిపోయాం. వీటిని తట్టుకోలేక మా అమ్మ ఏడాదిలోపు మనోవేదనతో చనిపోయింది. నాన్న, తమ్ముడు, అమ్మను కోల్పోయి ప్రత్యర్థులు కళ్లెదుటే తిరుగుతున్నా ఘర్షణకు దూరంగా ఉన్నాం. ఇరువర్గాలు రాజీ చేసుకుని కలిసిపోయిన ఏడాదిలోనే ప్రత్యర్థి వర్గం వారు ముగ్గురిని మట్టుబెట్టారు. దీంతో గ్రామం నుంచి కొందరు ఇళ్లు, పొలాలు వదిలేసి శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరి ఫ్యాక్షన్ కోరలకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. గొడవల్లో ఆస్తులు, ఆప్తులను పొగొట్టుకున్నాను. వర్గపోరులో అప్పట్లోనే మా నాన్న పదెకరాలు అమ్మేశారు. గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవలకు దిగి నష్టపోతే ఎలా ఉంటుందనడానికి మా కుటుంబమే సజీవ సాక్ష్యం.
ఒంటరిగా మిగిలిపోయాను..
- గొంటు రమణమ్మ, రెంటాల గ్రామం, రెంటచింతల మండలం
రెంటాల గ్రామంలో 1994లో చెలరేగిన వివాదంలో నా భర్త గోపాల్రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. 8 ఎకరాల వ్యవసాయ భూమి, సొంతిల్లుతో ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం తలకిందులైపోయింది. పెద్ద కుమారుడు హనిమిరెడ్డి ఇక్కడ జీవించలేక జంగమేశ్వరపురం వెళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయడంతో వారు అత్తగారింటికి వెళ్లిపోయారు. కాలక్రమంలో 6 ఎకరాల భూమి, సగం ఇల్లు కరిగిపోయింది. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన మా కుటుంబం ఆయన హత్య తర్వాత పడిన అవస్థలు వర్ణనాతీతం. నేతల మాటలు నమ్మి మా కుటుంబం కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఇప్పుడు ఒంటరిగా గ్రామంలో ఉండలేక చిన్న కూతురి ఇంట్లో ఉంటున్నాను. రాజకీయాలు, ముఠా తగాదాల వల్ల నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేతలను నమ్మి తగాదాలకు పోయి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఓ బాధితురాలిగా అందర్నీ వేడుకుంటున్నాను.
పదేళ్లపాటు నరకయాతన
- కోటేశ్వరమ్మ, చినగార్లపాడు గ్రామం, కారంపూడి మండలం
చినగార్లపాడు గ్రామంలో 1989 నుంచి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తరచూ వర్గపోరుకు దిగేవారు. ఈ గొడవల్లో ఆరుగురు హత్యకు గురయ్యారు. నిత్యం దాడులు, ప్రతి దాడులతో గ్రామం అట్టుడికిపోతుండేది. 2014లో పొలానికి నీళ్లు పెట్టుకునే విషయంలో తలెత్తిన వివాదం పార్టీల రంగులు పులుముకొని ప్రత్యర్థి వర్గంలో గోపాల్ అనే వ్యక్తిని హత్య చేశారు. నా భర్త గోవిందరెడ్డిపై కేసు నమోదవడంతో ఇల్లు, పొలాలు, వ్యాపారాలు వదిలేసి కోర్టుల చుట్టూ తిరుగుతుండేవారు. 2014 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో సెప్టెంబర్ నెలలో ప్రత్యర్థి వర్గీయులు నా భర్తను హత్య చేశారు. ప్రత్యర్థి హత్య విషయంలో ఉన్నత విద్యావంతుడైన నా కుమారుడు వెంకటరెడ్డి పేరు కూడా పెట్టడంతో అతనికి ఉద్యోగం దూరమైంది. ఒక పక్క కేసులు, మరో పక్క భర్త చనిపోయి ఇంటికి పెద్ద దిక్కు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ డబ్బులతో బతకడానికి, పెళ్లీడుకొచ్చిన కూతురి పెళ్లి చేసేందుకు అష్టకష్టాలు పడ్డాం. నా భర్త హత్యతో పదేళ్లపాటు నరకయాతన అనుభవించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం