Andhra Pradesh: నగరాలకు ముంపు ముప్పు
కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కాలనీలు నీటమునిగాయి. నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేయకపోవడంతో ముంపు సమస్య మరింత తీవ్రమైంది.
చినుకు పడితే ప్రమాదమే
కాలవల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత
వర్షాకాలం సమీపిస్తున్నా మేల్కోని యంత్రాంగం
ఈనాడు - అమరావతి
విజయవాడలో అసంపూర్తిగా నిలిచిపోయిన వరదనీటి కాలవ పనులు
ఈ నెల ఏడో తేదీన కురిసిన కొద్దిపాటి వర్షానికే రాజమహేంద్రవరం నగరం అతలాకుతలమైంది. అప్పటికే మురుగు కాలవలు పూడికతో నిండిపోవడంతో వాన నీటికి తోడు మురుగునీరు కలిసి రోడ్లపై పొంగి పొర్లింది. నగరవాసులు నరకయాతన పడ్డారు. ఇంత జరిగినా ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగింపునకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. ఒక్క రాజమహేంద్రవరంలోనే కాదు రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
నగరాలలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలవల ద్వారా నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి వస్తోంది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సమస్యకు కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో చేసిన ప్రయత్నమేమీ లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వరద, మురుగునీటి కాలవల పనులూ పక్కన పెట్టారు. కనీసం ఏటా కాలవల్లో పూడికలు తొలగించే ప్రయత్నమైనా చేస్తున్నారా అంటే ఇప్పటివరకు అరకొర పనులతో నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పనులే ప్రారంభించకపోవడం నగరపాలక సంస్థల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.
విశాఖలో గెడ్డలతో గండమే
విశాఖలో ముఖ్యమైన గెడ్డలు, కాలవల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా...పాత నగరంలోని చాలా ప్రాంతాలు ఆరు గంటలకుపైగా నీటి ముంపులోనే ఉన్నాయి.
ఎర్రిగెడ్డ, ఎస్ఎల్ కెనాల్, గంగులగెడ్డలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలు ఈ ఏడాది ఇప్పటికీ తొలగించలేదు. మల్కాపురం గెడ్డ, ఏకలవ్యకాలనీకి ఆనుకుని ఉన్న గెడ్డ, కేఆర్ఎం కాలనీ, మద్దిపాలెం పరిసరాల్లోని వరద నీటి కాలవల్లోనూ వ్యర్థాలు పేరుకుపోయాయి.
కడపలో పొంచి ఉన్న ముప్పు రహదారుల విస్తరణలో భాగంగా కడపలో పడగొట్టిన మురుగు కాలవలను తిరిగి ఇప్పటికీ పూర్తిగా పునర్నిర్మించని కారణంగా ఈ ఏడాది వర్షాకాలంలో కడపవాసులకు ముంపు కష్టాలు తప్పేలాలేవు. విస్తరణలో భాగంగా దెబ్బతిన్న కాలవలు పూడిపోయాయి.. వర్షాలు కురిస్తే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. నగర పరిధిలో 23 ప్రాంతాల్లో వరద నీటి కాలవల నిర్మాణం కోసం గత ఏడాది రూ.73 కోట్లతో టెండర్లు ఖరారు చేసినా ఇప్పటివరకు మూడు ప్రాంతాల్లోనే పనులు ప్రారంభించారు. ఇవి కూడా నత్తనడకన సాగడంతో మురుగు నీరు ముందుకు సాగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మిగిలిన 20 కాలవల నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు.
కడప కోటిరెడ్డి కూడలిలో నత్తనడకన వరదనీటి కాలవ పనులు
విజయవాడలో పనులు టెండర్లకే పరిమితం
విజయవాడలో మురుగు కాలవల్లో పూడిక తొలగింపు పనులు టెండర్లకే పరిమితమయ్యాయి. నగర పరిధిలో 133 కిలోమీటర్ల పొడవునా కాలవలు ఉన్నాయి. వీటిలో ఏటా ఈ పాటికే 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యేవి. ఈసారి టెండర్లు పిలిచి ఎన్నికల కోడ్ పేరుతో పక్కన పెట్టారు. గట్టిగా వర్షం కురిసినప్పుడల్లా నగరంలోని అత్యధిక ప్రాంతాలు ఏరులవుతున్నాయి. బెంజిసర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, దుర్గా థియేటర్ వరకు రోడ్లకు ఇరువైపులా భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. నిర్మలాకాన్వెంట్, మొగల్రాజుపురం, ఏపీఐఐసీ కాలనీతోపాటు సింగ్నగర్ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వరద నీటిపారుదల కాలవల పనులను వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేయడంవల్ల వర్షాకాలం వచ్చిందంటే నగర ప్రజల అవస్థలు వర్ణనాతీతం.
రాజమహేంద్రవరంలో నల్లా ఛానల్లో పేరుకున్న వ్యర్థాలు
రాజమహేంద్రవరం అధికారుల మొద్దునిద్ర
రాజమహేంద్రవరంలో 630 కిలో మీటర్ల విస్తీర్ణంలోని కాలవల్లో పూడికల తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మురుగు నీటిని గోదావరిలోకి పంపే నల్లా, ఆవ ఛానళ్లతోపాటు ప్రధాన కాలవలను శుభ్రం చేసేందుకు ఏటా వర్షాకాలం ముందు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చిస్తారు. ఈసారి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నల్లా ఛానల్లో కలిసే అనుసంధాన కాలవల్లో పూడికను తొలగించకపోతే నగరంలోని ఆర్యాపురం, తుమ్మలావ, కృష్ణానగర్, ఆదెమ్మదిబ్బ, సీతంపేటకు వెళ్లే రహదారులు ముంపు బారిన పడతాయి. ఎగువ బాలాచెరువు నుంచి దిగువ వై-జంక్షన్ వరకూ వచ్చే కాలవల్లో పూడికను తీయకపోతే హైటెక్ బస్టాండ్, కంబాలచెరువు, సుబ్బారావునగర్ ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోతుంది.
నెల్లూరులో పూడికలతో నిండిన కాలవ
నెల్లూరులో అదే నిర్లక్ష్యం
నెల్లూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. పూడిక తొలగించకపోవడం, ఆక్రమణలు క్రమంగా పెరిగిపోవడంతో కొద్దిపాటి వర్షానికి నగరం జలమయమవుతోంది. ప్రతి ఏటా ఇదో పెద్ద సమస్యగా తయారవుతున్నా యంత్రాంగం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పూడికల పనులు ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి నగరంలోని పంట కాలవల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ముంపు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇటు నగరపాలక సంస్థ, అటు జలవనరులశాఖ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఏటా మనసునగర్, కుదుస్నగర్, పరమేశ్వర్నగర్, మనుమసిద్ధినగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు.
కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైన వైఎస్ఆర్ కూడలి
కాకినాడలో పొంగిపొర్లిన డ్రెయిన్లు
శుక్రవారం కాకినాడ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు
కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కాలనీలు నీటమునిగాయి. నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేయకపోవడంతో ముంపు సమస్య మరింత తీవ్రమైంది. బాలాజీచెరువు, భానుగుడి కూడలి, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, కొత్తపేట, పిండాలచెరువు, నూకాలమ్మగుడి, మొయిన్రోడ్డు, సినిమారోడ్డు తదితర ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షాకాలం రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని స్థానికులు భయపడుతున్నారు.
న్యూస్టుడే, కాకినాడ కలెక్టరేట్
గుంటూరులో నిలువెల్లా నిర్లక్ష్యం
గుంటూరులో బ్రాడీపేట పీకలవాగు మురుగు కాలవలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు
వర్షం కురిస్తేచాలు గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణమవుతోంది. ఉద్ధృతంగా ప్రవహించే కాలవల్లో చిన్నారులు కొట్టుకుపోతుంటారు. వర్షాకాలం సమీపిస్తున్నా నగరపాలక సంస్థ ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగించే పనులు ప్రారంభించలేదు. కొద్దిపాటి వర్షానికే నగరంలోని అనేక రహదారులు జలమయమవుతుంటాయి. కాలవల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి వస్తుంటుంది. వాగులు, కాలవల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని పట్టణ ప్రణాళిక విభాగానికి ఈనెల 15న ఆస్తి పన్ను చెల్లింపుదారుల సంఘం లేఖ రాసినా స్పందన లేదు. గత ఏడాది కూడా సరైన ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నగరంలో దాదాపు 25 ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన నగరపాలక సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి