Andhra News: నమ్మకం పోయాకే... ప్రాణం తీసుకోవాలనుకున్నా
‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏ సమస్యా సీఎం దాకా చేరడం లేదు
పరామర్శకు వచ్చిన అధికారులకు ఇదే చెప్పా
ఆసుపత్రిలో మంచంపై నుంచి కదల్లేక.. పాపకు సేవ చేయలేక తల్లడిల్లుతున్నా
‘ఈనాడు’తో ఆరుద్ర ఆవేదన
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, అన్నవరం: ‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎంకు బాధ చెప్పుకొంటే పరిష్కారం దొరుకుతుందనుకుని ఇంతదూరం వస్తే... ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు పక్కన ఉన్నా.. ఆయన దృష్టిలో పడతామనుకుంటే.. అక్కడా నిల్చోనీయలేదు. పాపను పక్క వీధిలోకి తీసుకెళ్లిపోయారు. రోడ్డు మీద కూడా ఉండనీయకపోతే మేం ఎక్కడ చావాలి.. అందుకే నమ్మకం పోయింది. ఏ విషయమూ సీఎం దాకా వెళ్లడంలేదు. మధ్యలో వాళ్లే ఆపేస్తున్నారు. బిడ్డను తీసుకుని కోర్టుల చుట్టూ తిరిగే ఓపికలేదు. దానికంటే చచ్చిపోవడం మేలనిపించింది’ అని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన రాజులపూడి ఆరుద్ర ఆవేదన వ్యక్తంచేశారు. టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్తో బాధపడుతున్న కుమార్తె సాయిలక్ష్మి చంద్ర ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎవరిమీదా ఆధారపడలేదనీ.. ఉన్న ఆస్తులు అమ్ముకుందామనుకుంటే కొందరు అడ్డుతగులుతున్నారని ఆమె వాపోయారు. 2019లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ(గ్రేడ్-2) ఉద్యోగానికి కాల్లెటర్ వచ్చినా పాపను చూసుకోవడానికి ఎవరూ లేక ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ముఖ్యమంత్రి పంపించారంటూ... ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు. కానిస్టేబుల్స్ ఆటంకాలతో ఇంటి అమ్మకానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అమలాపురంలో స్థల సమస్య, పాప ఆరోగ్య సమస్యలను వారికి వివరించినట్లు చెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని ఆరుద్ర వెల్లడించారు.
సమస్య చెప్పుకోవాలంటే ఇంత కష్టమా...
గత నెల 31న సీఎంను కలిసేందుకు విజయవాడ వచ్చామని.. పాపకు నీరసంగా ఉందని ఎం-లాడ్జిలో విశ్రాంతి తీసుకున్నామని ఆరుద్ర తెలిపారు. ఈ నెల 1న ఉదయం 8 గంటలకు తాడేపల్లిలో సీఎంను కలుద్దామని వెళ్తే... ఇక్కడ కుదరదని, విజయవాడలో ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని అక్కడికి వెళ్లాలంటూ సిబ్బంది పంపేశారు. విజయవాడ వస్తే ఇక్కడ కుదరదు... తాడేపల్లిలోని ఇంటిదగ్గరకే వెళ్లండంటూ పంపేశారని చెప్పారు. అక్కడి నుంచి సీఎం ఇంటికెళితే సమయం అయిపోయిందంటూ వెనక్కి పంపేశారని వాపోయారు. ‘బుధవారం వెళ్లినా సీఎంను కలవడం కుదరదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్లిపోండి మేం పంపిస్తామన్నారు. వివరాలు చెబుతుంటే.. కానిస్టేబుల్ది సివిల్ కేసు.. పట్టించుకోరని.. మా ప్రయత్నం మేము చేస్తామని అక్కడివారు అన్నారు. నమ్మకం పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను’ అని ఆరుద్ర వాపోయారు.
పాపను చూసుకోలేకపోతున్నా...
జీజీహెచ్లో పాపను చూసుకోవడానికి ఆయమ్మలు, స్టాఫ్ లేక ఇబ్బందిగా ఉందని ఆరుద్ర తెలిపారు. ‘చేయి కోసుకున్న నన్ను ఆసుపత్రిలో చేర్పించినప్పట్నుంచి పాప నాదగ్గరే ఉంది. పాపను కనీసం వాష్రూమ్కు తీసుకెళ్లడానికీ ఇబ్బంది పడుతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పాప సాయిలక్ష్మి చంద్రకు ఆసుపత్రి సిబ్బంది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారని.. మూడు రోజుల్లో రిపోర్టు ఇస్తామన్నారని చెప్పారు. ఆరుద్ర ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సమయంలో కాకినాడ గ్రామీణంలోని రాయుడుపాలెంలో ఉన్న ఆమె భర్త భువనేశ్వర్ సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని విజయవాడ వెళ్లారు. ప్రస్తుతం భార్య, బిడ్డల దగ్గరే ఉన్నారు.
ఆరుద్ర వాంగ్మూలం నమోదు
తాడేపల్లి: ఆరుద్ర నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేయలేదని చెప్పారు. వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని చెప్పారు.
బాధితురాలిని పరామర్శించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి, కలెక్టర్
ఈనాడు, అమరావతి - విజయవాడ వైద్యం, న్యూస్టుడే: ఆరుద్రను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము వచ్చామని, ప్రభుత్వం అండగా ఉండి ఆమె సమస్యలను పరిష్కరిస్తుందని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఆరుద్ర, ఆమె కుటుంబసభ్యులతో కలెక్టర్ మాట్లాడి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని రాసుకున్నారు.
వైద్యం చేయించలేకపోతున్నాననే బాధతోనే..
ఆరుద్రను పరామర్శించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ... కుమార్తెకు విదేశాలలో వైద్య చికిత్స అందించేందుకు తీసుకెళ్లలేకపోతున్నాననే ఆందోళన ఆరుద్రలో పెరిగిపోయిందని కలెక్టర్ వెల్లడించారు. అందుకే తన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. సీఎంను కలవలేకపోయాననే మనస్తాపం బాధితురాలిలో పెరిగిపోయిందని, అందుకే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నారని చెప్పారు. ఆరుద్ర ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే సీఎంకు తెలిపామని, నివేదిక రూపంలోనూ అందిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి శుక్రవారం మరోసారి ఆరుద్రను కలుస్తారని ఢిల్లీరావు వెల్లడించారు. ప్రస్తుతం ఆరుద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆమె చేతికి అయిన గాయానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. ఆత్మహత్యాయత్నంపై ఆరుద్ర వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయలేదని, వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే