Andhra News: నమ్మకం పోయాకే... ప్రాణం తీసుకోవాలనుకున్నా
‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏ సమస్యా సీఎం దాకా చేరడం లేదు
పరామర్శకు వచ్చిన అధికారులకు ఇదే చెప్పా
ఆసుపత్రిలో మంచంపై నుంచి కదల్లేక.. పాపకు సేవ చేయలేక తల్లడిల్లుతున్నా
‘ఈనాడు’తో ఆరుద్ర ఆవేదన
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, అన్నవరం: ‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎంకు బాధ చెప్పుకొంటే పరిష్కారం దొరుకుతుందనుకుని ఇంతదూరం వస్తే... ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు పక్కన ఉన్నా.. ఆయన దృష్టిలో పడతామనుకుంటే.. అక్కడా నిల్చోనీయలేదు. పాపను పక్క వీధిలోకి తీసుకెళ్లిపోయారు. రోడ్డు మీద కూడా ఉండనీయకపోతే మేం ఎక్కడ చావాలి.. అందుకే నమ్మకం పోయింది. ఏ విషయమూ సీఎం దాకా వెళ్లడంలేదు. మధ్యలో వాళ్లే ఆపేస్తున్నారు. బిడ్డను తీసుకుని కోర్టుల చుట్టూ తిరిగే ఓపికలేదు. దానికంటే చచ్చిపోవడం మేలనిపించింది’ అని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన రాజులపూడి ఆరుద్ర ఆవేదన వ్యక్తంచేశారు. టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్తో బాధపడుతున్న కుమార్తె సాయిలక్ష్మి చంద్ర ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎవరిమీదా ఆధారపడలేదనీ.. ఉన్న ఆస్తులు అమ్ముకుందామనుకుంటే కొందరు అడ్డుతగులుతున్నారని ఆమె వాపోయారు. 2019లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ(గ్రేడ్-2) ఉద్యోగానికి కాల్లెటర్ వచ్చినా పాపను చూసుకోవడానికి ఎవరూ లేక ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ముఖ్యమంత్రి పంపించారంటూ... ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు. కానిస్టేబుల్స్ ఆటంకాలతో ఇంటి అమ్మకానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అమలాపురంలో స్థల సమస్య, పాప ఆరోగ్య సమస్యలను వారికి వివరించినట్లు చెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని ఆరుద్ర వెల్లడించారు.
సమస్య చెప్పుకోవాలంటే ఇంత కష్టమా...
గత నెల 31న సీఎంను కలిసేందుకు విజయవాడ వచ్చామని.. పాపకు నీరసంగా ఉందని ఎం-లాడ్జిలో విశ్రాంతి తీసుకున్నామని ఆరుద్ర తెలిపారు. ఈ నెల 1న ఉదయం 8 గంటలకు తాడేపల్లిలో సీఎంను కలుద్దామని వెళ్తే... ఇక్కడ కుదరదని, విజయవాడలో ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని అక్కడికి వెళ్లాలంటూ సిబ్బంది పంపేశారు. విజయవాడ వస్తే ఇక్కడ కుదరదు... తాడేపల్లిలోని ఇంటిదగ్గరకే వెళ్లండంటూ పంపేశారని చెప్పారు. అక్కడి నుంచి సీఎం ఇంటికెళితే సమయం అయిపోయిందంటూ వెనక్కి పంపేశారని వాపోయారు. ‘బుధవారం వెళ్లినా సీఎంను కలవడం కుదరదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్లిపోండి మేం పంపిస్తామన్నారు. వివరాలు చెబుతుంటే.. కానిస్టేబుల్ది సివిల్ కేసు.. పట్టించుకోరని.. మా ప్రయత్నం మేము చేస్తామని అక్కడివారు అన్నారు. నమ్మకం పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను’ అని ఆరుద్ర వాపోయారు.
పాపను చూసుకోలేకపోతున్నా...
జీజీహెచ్లో పాపను చూసుకోవడానికి ఆయమ్మలు, స్టాఫ్ లేక ఇబ్బందిగా ఉందని ఆరుద్ర తెలిపారు. ‘చేయి కోసుకున్న నన్ను ఆసుపత్రిలో చేర్పించినప్పట్నుంచి పాప నాదగ్గరే ఉంది. పాపను కనీసం వాష్రూమ్కు తీసుకెళ్లడానికీ ఇబ్బంది పడుతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పాప సాయిలక్ష్మి చంద్రకు ఆసుపత్రి సిబ్బంది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారని.. మూడు రోజుల్లో రిపోర్టు ఇస్తామన్నారని చెప్పారు. ఆరుద్ర ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సమయంలో కాకినాడ గ్రామీణంలోని రాయుడుపాలెంలో ఉన్న ఆమె భర్త భువనేశ్వర్ సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని విజయవాడ వెళ్లారు. ప్రస్తుతం భార్య, బిడ్డల దగ్గరే ఉన్నారు.
ఆరుద్ర వాంగ్మూలం నమోదు
తాడేపల్లి: ఆరుద్ర నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేయలేదని చెప్పారు. వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని చెప్పారు.
బాధితురాలిని పరామర్శించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి, కలెక్టర్
ఈనాడు, అమరావతి - విజయవాడ వైద్యం, న్యూస్టుడే: ఆరుద్రను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిసి ఆయన గురువారం పరామర్శించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము వచ్చామని, ప్రభుత్వం అండగా ఉండి ఆమె సమస్యలను పరిష్కరిస్తుందని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఆరుద్ర, ఆమె కుటుంబసభ్యులతో కలెక్టర్ మాట్లాడి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని రాసుకున్నారు.
వైద్యం చేయించలేకపోతున్నాననే బాధతోనే..
ఆరుద్రను పరామర్శించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ... కుమార్తెకు విదేశాలలో వైద్య చికిత్స అందించేందుకు తీసుకెళ్లలేకపోతున్నాననే ఆందోళన ఆరుద్రలో పెరిగిపోయిందని కలెక్టర్ వెల్లడించారు. అందుకే తన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. సీఎంను కలవలేకపోయాననే మనస్తాపం బాధితురాలిలో పెరిగిపోయిందని, అందుకే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నారని చెప్పారు. ఆరుద్ర ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే సీఎంకు తెలిపామని, నివేదిక రూపంలోనూ అందిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి శుక్రవారం మరోసారి ఆరుద్రను కలుస్తారని ఢిల్లీరావు వెల్లడించారు. ప్రస్తుతం ఆరుద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆమె చేతికి అయిన గాయానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. ఆత్మహత్యాయత్నంపై ఆరుద్ర వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయలేదని, వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!