6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి సోమవారం ప్రకటన జారీచేసింది.
411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు
విడుదల చేసిన ఏపీ పోలీసు నియామక మండలి
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి సోమవారం ప్రకటన జారీచేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీచేశారు. సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్హతలు
* సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.
* సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్ రెండేళ్లు చదివి ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి
* సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.
* కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1998 జులై 2 తర్వాత, 2004 జులై 1 కంటే ముందు పుట్టినవారై ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
హోంగార్డులకు రిజర్వేషన్లు
* హోంగార్డులకు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్ను 8 నుంచి 15 శాతానికి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు 10 నుంచి 25 శాతానికి పెంచారు.
* ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు రెండింటిలోనూ మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ
* ఆన్లైన్లో slprb.ap.gov.in లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
* సందేహాలు ఉంటే: ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి ఫోన్ నంబరు 9441450639కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్ చేయొచ్చు.
మూడు దశల్లో ఎంపిక
సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు
* ప్రాథమిక రాత పరీక్ష: 2 పేపర్లు...200 మార్కులకు. బహుళైౖచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-1: పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
పేపర్-2: జనరల్ స్టడీస్ (డిగ్రీ స్థాయిలో)
దేహదారుఢ్య పరీక్షలు
* ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారినే దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేస్తారు.
* సివిల్ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. లాంగ్జంప్ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
* ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్ మూడూ పూర్తిచేయాలి. 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
తుది రాత పరీక్ష
* మొత్తం పేపర్లు: 4 - మార్కులు: 600
* పేపర్-1: ఆంగ్లం (100 మార్కులకు)
* పేపర్-2: తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులకు)
* ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
* పేపర్-3: అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ (200 మార్కులకు)
* పేపర్-4: జనరల్ స్టడీస్ (200 మార్కులకు)
* వీటిల్లో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
* ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
* పేపర్-3, పేపర్-4లో 400 మార్కులకు అత్యధిక మార్కులు సాధించినవారిని సివిల్ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
* ఏపీఎస్పీ ఆర్ఎస్సై పోస్టులకు పోటీపడేవారికి పేపర్-1, పేపర్-2 యథాతథంగా ఉంటాయి. పేపర్-3, పేపర్-4లను చెరో వందమార్కుల చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులకు దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులను కలపుతారు. అత్యధిక మార్కులు సాధించినవారిని ఉద్యోగానికి ఎంపికచేస్తారు.
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ఇలా
మొదటి దశ:
ప్రాథమిక రాతపరీక్ష: ఒకటే పేపర్ 200 మార్కులకు (3 గంటల పాటు)
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్ (పదోతరగతి స్థాయి), రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతచరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమాన అంశాలు.
రెండో దశ:
శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే నిర్వహిస్తారు.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి. లాంగ్జంప్ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపిక కోసం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్ మూడూ పూర్తిచేయాలి. ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు. వీటిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
మూడో దశ:
తుది రాతపరీక్ష: శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైనవారికి తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్ (పదోతరగతి స్థాయి), రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతచరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక: తుది రాతపరీక్షలో 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక: చెరో వందమార్కులకు నిర్వహించే దేహదారుఢ్య, తుది రాతపరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ముఖ్యమైన తేదీలు
సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 డిసెంబరు 14 నుంచి
* దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2023 జనవరి 1
* ప్రాథమిక రాతపరీక్షకు హాల్టికెట్ల డౌన్లోడ్: 2023 ఫిబ్రవరి 5 నుంచి
* పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి 19 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్-2)
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 నవంబరు 30
* దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2022 డిసెంబరు 28
* ప్రాథమిక రాత పరీక్షకు హాల్టికెట్ల డౌన్లోడ్: 2023 జనవరి 9 నుంచి
* పరీక్ష తేదీ: 2023 జనవరి 22
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని